రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. సినీ ఇండస్ట్రీలో ఒక మంచి హీరోయిన్ గా , ఇటు బుల్లి తెరపై జడ్జిగా, అటు రాజకీయాల్లో కూడా తన సత్తా ఏంటో చూపిస్తోంది రోజా. ఈమె దిగిన ఏ రంగం అయినా సరే సక్సెస్ అవ్వక మానదు. కానీ ఈమెను అప్పట్లో కొంతమంది ఐరన్ లెగ్ అని బిరుదు ఇచ్చినా,  ఈమెది గోల్డెన్ లెగ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె ఏ కార్యం మొదలు పెట్టినా అది విజయవంతం అవుతుంది. ఇక ప్రస్తుతం ఈమె జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కొంతకాలం జబర్థస్త్ షో కి దూరం అయింది. ఇక  ఆమె స్థానాన్ని పూర్తి చేశారు సీనియర్ నటి ఇంద్రజ . ఇక ఈమె కూడా రోజా లేని లోటును తీర్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


అయితే రెండు వారాల క్రితమే రోజా తన ఆరోగ్యం మెరుగుపడటంతో, తిరిగి జబర్దస్త్ షో లోకి ప్రవేశించింది. ఇదిలా ఉండగా ,ఇప్పుడు ఈమె వెండితెర పై రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోందట. అది ఎవరితోనో కాదు శర్వానంద్ హీరోగా నటించబోతున్న ఒక సినిమాలో, హీరోకి తల్లిగా నటించే ఛాన్స్ అట. ఇక అందుకోసమే ఈమె బరువు కూడా తగ్గుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రోజా సినీ ఇండస్ట్రీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.


ఇక శర్వానంద్ గత మూడు వారాలుగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లోనే ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఒక షార్ట్ ఫిలిం రూపొందించాలని అనుకుంటున్నారు. ఇక అందులో రామ్ చరణ్ అలాగే శర్వానంద్ ఇద్దరూ కలిసి నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక స్క్రిప్టు రెడీ చేయడం కోసం శర్వానంద్, ఉపాసన, రామ్ చరణ్ లతో కలిసి షార్ట్ ఫిలిం కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: