ఆర్య సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రొమాంటిక్ డైరెక్టర్ సుకుమార్. తనదైన శైలీలో సినిమాలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్. ఇండస్ట్రీలో ఒకవైపు దర్శకునిగా విజయాలను అందుకుంటున్న సుకుమార్ మరోవైపు తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తున్నారు. అంతేకాదు.. శిష్యులకు ఇండస్ట్రీలో గుర్తింపు దక్కేలా చేస్తున్నారు. తన దగ్గర శిష్యులగా చేసిన వారి సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ సుకుమార్ విజయాలను సొంతంచేసుకుంటున్నాడు సుకుమార్.

ఇక ఇండస్ట్రీలో ఇతర దర్శకులతో పోలిస్తే సుకుమార్ సినిమాలో కథ, కథనాలు ఎవరు ఊహించనంత భిన్నంగా ఉంటాయి. ఇక దర్శకధీరుడు రాజమౌళి సైతం సుకుమార్ ప్రతిభాపాటవాలను మెచ్చుకున్న సంగతి అందరికి తెలిసందే. ఇక సుకుమార్ భార్య తబిత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు.

ఆ పోస్టుకి సంబంధించిన విషయం ఏంటంటే.. సుకుమార్ తబితల వివాహ మహోత్సవం కావడంతో సుకుమార్ తనపై ప్రేమతో రాసిన కవితను తబిత సుకుమార్ అభిమానులతో పంచుకుంది. ఇక అందులో “నేను ఎప్పుడూ సగాన్ని.. నువ్వు రాకముందు పూర్తి కాని సగాన్ని.. నువ్వు వచ్చాక పూర్తైన సగాన్ని.. నేను పూర్తి కావడం అంటే నీ సగం అవ్వడమే కదా.. నా సగానికి ప్రేమతో మ్యారేజ్ డే విషెస్” అని సుకుమార్ కవిత రాసినట్లు తెలిపారు. ఇక ఇప్పుడు సుకుమార్ రాసిన కవిత నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆ కవితను ఆకర్షిస్తుంది.

అయితే తబితతో పాటు నెటిజన్లు సైతం సుకుమార్ రాసిన కవిత ఎంతో బాగుందని వారి అభిప్రాయాలను కామెంట్లు రూపంలో తెలియేస్తున్నారు. అంతేకాదు.. రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప సుకుమార్ బన్నీ కెరీర్ లలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: