సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య ఏదో రకంగా సంబంధం ఉంటుంది. గట్టిగా వెతకాలి కానీ కొంతమంది హీరోయిన్ హీరోయిన్ కి మధ్య రక్త సంబంధం కూడా ఉంటుంది. అలా బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న విద్యాబాలన్, టాలీవుడ్ లో నటిగా అలరిస్తున్న ప్రియమణి, సౌత్ ఇండియన్ సినిమా ను  ఏలుతున్న త్రిష ల  మధ్య రిలేషన్ ఉందట. ఈ విషయాన్ని విద్యాబాలన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించింది.

ప్రియమణి నాకు బంధువు. వరుస కు కజిన్. మా తల్లి తరఫున రిలేషన్ ఉంది మా ఇద్దరికీ.  మా కుటుంబాల మధ్య అంతగా రిలేషన్స్ లేవు కానీ ఓ అవార్డు ఫంక్షన్లో ప్రియమణి కలిసిన తర్వాత మా ఇద్దరి మధ్య రిలేషన్ మరింత బలపడింది. కుటుంబాల మధ్య అనుబంధాలు పెరిగాయి అని అన్నారు. ఇక త్రిష విషయానికి వస్తే ప్రియమణికి త్రిష చాలా దగ్గరి బంధువు.  తన తండ్రి తరఫున దగ్గర బంధుత్వం ఉంది.  వారిద్దరు కూడా కజిన్స్ అవుతారు. అలా వీరి మధ్య రిలేషన్ ఉంది. కానీ ఎప్పుడూ ప్రొఫెషనల్ గా కనిపిస్తారు. బంధుత్వాలు బయట పెట్టుకోవడం మన హీరోయిన్లలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది.

ప్రస్తుతం విద్యాబాలన్ బాలీవుడ్ లో శేర్ని అనే సినిమా చేస్తూ ఉండగా ప్రియమణి బుల్లితెరపై జడ్జిగా అలరిస్తుంది. నారప్ప, విరాటపర్వం వంటి సినిమాల్లో కూడా ఆమె కీలక పాత్రల్లో నటిస్తోంది. త్రిష కూడా తమిళ్ లో కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలో చేస్తుంది. గతంలో ఎన్నో సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈమె దాదాపు అరడజను సినిమాలను సెట్స్ మీద ఉంచింది. మణిరత్నం తెరకెక్కించనున్న పొన్నియన్ సెల్వం తో పాటు రామ్ అనే మలయాళ చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా కూడా త్రిష క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని ఆమె చేస్తున్న సినిమాల వరస ను బట్టి చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: