టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వున్నాడు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో rrr సినిమా చేస్తున్న తారక్..ఈ సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ సినిమాను చేస్తున్నాడు తారక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవల వెలువడిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ తాజా ప్రాజెక్ట్ పై భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా వున్నాడు కొరటాల.

ఎప్పటిలాగానే ఈసారి కూడా సామాజిక అంశాలను మేళవించి వాటికి పలు కమర్షియల్ హంగులను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాలో ఎన్టీఆర్ ని ఓ స్టూడెంట్ లీడర్ గా ప్రెజెంట్ చేయనున్నాడట కొరటాల.ఇదిలా ఉంటె ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ నటించనుందట.అప్పుడెప్పుడో ఎన్టీఆర్ తో నా అల్లుడు సినిమాలో నటించింది రమ్యకృష్ణ. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ మళ్లీ రమ్యకృష్ణ తో నటించలేదు.

అయితే కొరటాల శివ ఈ సినిమాలో రమ్యకృష్ణ ను ఎన్టీఆర్ కి పిన్నిగా నటింపజేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు త్వరలోనే రమ్యకృష్ణ ని కలిసి కథ వినిపించనున్నాడని అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే చిత్ర యూనిట్ దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాల్సిందే.ఇక కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కేవలం 10శాతం మాత్రమే మిగిలుందట. ఈ కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత మిగతా షూటింగ్ ని పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: