ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రాశీకన్నా ఆ తర్వాత వరుస తెలుగు హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో గోపీచంద్ హీరోగా చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమాతో పాటు ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సైంటిఫిక్ థ్రిల్లర్ లోనూ కీలక పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తన అందం అభినయం టాలెంట్ తో తెలుగునాట కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈమె ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాది ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా నడుచుకుంటూ వారికి నచ్చే సినిమాలు చేసుకుంటూ పాపులారిటీ దక్కించుకుంది.

ఒకవైపు సినిమాలతో మరో వైపు హాట్ హాట్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో రాశీ అందాలకు కొదవలేదు. నిత్యం ఏదో రకంగా ఫోటోలను అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. అందాలరాశి కి ఏ మాత్రం తగ్గని రాశిఖన్నా బ్యూటీ విషయంలో, ఎక్స్ పోజింగ్ విషయంలో లో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. నిజానికి మొదట్లో పద్ధతి గల పాత్రల్లో చేసే ఆమె ఆ తర్వాత గ్లామర్ పాత్రలు చేసి మరిన్ని అవకాశాలు దక్కించుకుంటుంది.

ఇండస్ట్రీలో సన్నగా ఉన్న అమ్మాయిలకు ఎక్కువగా ఆఫర్ లు వచ్చేది కానీ కొంచెం బొద్దుగా ఉన్నా కూడా రాశికి మంచి అవకాశాలు రావడం మొదలు పెట్టాయి అయితే సన్నగా ఉంటేనే మంచిదని తెలుసుకొని జిల్ సినిమా సమయంలో ఐదు కేజీలు తగ్గి మరింత ఆకర్షణీయంగా తయారయింది. ఈ నేపథ్యంలో ఆమెకు  థైరాయిడ్ సమస్యలు ఉన్నాయని తెలిపింది.  అదే సమయంలో లవ్ బ్రేకప్ కావడం తో డిప్రెషన్లోకి వెళ్లి ఆరోగ్యాన్ని కూడా సరిగా పట్టించుకోలేదు అని, అందుకే తాను బొద్దు గా అయినట్లు తెలిపింది. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: