అయితే తాజాగా బాలయ్య గురించి ఓ వార్త సినీ సర్కిల్స్లో తెగ హల్చల్ చేస్తుంది. తన తదుపరి సినిమా కథ కోసం దర్శకుడు క్రిష్కు ఫోన్ చేసి బాలయ్య మాట్లాడాడట. అతడికి బాలయ్య ఫోన్ చేసి అతడి దగ్గర ఉన్న కథ తనకే కావాలని, ఆ సినిమా తానే చేస్తానని ఆర్డర్ వేశారట. ఆ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందట. ఇందులో బాలయ్యకు తగ్గ యాక్సన్, పవర్ ఫుల్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయట. అందులోని కొన్ని సన్నివేశాలకు రోమాలు నిక్కబొడుసుకుంటాయట. అవి నచ్చడంతో బాలయ్య ఈ సినిమా చేయాలని తెగ కుతూహల పడుతున్నాడట. ఈ సినిమాను కుదిరితే 2024 జనవరిలో విడుదల చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నాడని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మరి ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలో ఏమైనా వస్తుందేమో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య తన తాజా సినిమాను బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకు ‘అఖండ’ అని పేరును ఫిక్స్ చేశారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సంచలనాలు సృష్టించాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.