నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య పేరంటే తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరనడంలో అతిశయోక్తేమీ లేదు. బాలయ్య సినిమా అంటే థియేటర్ల ముందు అభిమానులు చేసే రచ్చకు తగ్గట్టుగానే బాలయ్య కూడా బిగ్‌స్క్రీన్‌పై తన పవర్ ఫుల్ డైలాగ్స్‌తో రచ్చ చేస్తాడు. ఇక బాలయ్య సినిమాల్లో ఫైట్స్ అంటే అభిమానులకు పూనకాలు రావడం పక్కా. అందుకనే బాలయ్య కూడా తన సినిమాల విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తను చేసే సినిమాలపై అభిమానులు పెట్టుకునే అంచనాలను ఏమాత్రం తగ్గనివ్వకూడదని బాలయ్య ఎంతో కష్టపడుతుంటాడు. తన వద్దకు వచ్చే కథలో ది బెస్ట్ అనిపించిన కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభిమానులను అలరిస్తుంటాడు.
అయితే తాజాగా బాలయ్య గురించి ఓ వార్త సినీ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తుంది. తన తదుపరి సినిమా కథ కోసం దర్శకుడు క్రిష్‌కు ఫోన్ చేసి బాలయ్య మాట్లాడాడట. అతడికి బాలయ్య ఫోన్ చేసి అతడి దగ్గర ఉన్న కథ తనకే కావాలని, ఆ సినిమా తానే చేస్తానని ఆర్డర్ వేశారట. ఆ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందట. ఇందులో బాలయ్యకు తగ్గ యాక్సన్, పవర్ ఫుల్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయట. అందులోని కొన్ని సన్నివేశాలకు రోమాలు నిక్కబొడుసుకుంటాయట. అవి నచ్చడంతో బాలయ్యసినిమా చేయాలని తెగ కుతూహల పడుతున్నాడట. ఈ సినిమాను కుదిరితే 2024 జనవరిలో విడుదల చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నాడని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మరి ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలో ఏమైనా వస్తుందేమో వేచి చూడాలి.


ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య తన తాజా సినిమాను బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకు ‘అఖండ’ అని పేరును ఫిక్స్ చేశారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ కూడా సంచలనాలు సృష్టించాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: