నాగార్జున నట వారసుడిగా వచ్చిన అక్కినేని వారి చిన్నబ్బాయి అఖిల్ మూడు సినిమాలు చేసినా ఒక్క హిట్టు కూడా దక్కకపోవడంతో అక్కినేని అభిమానులు తీవ్రమైన నిరాశ లో కూరుకుపోయారు. వీవీవినాయక దర్శకత్వంలో భారీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కిన అఖిల్ మొదటి సినిమా అఖిల్ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. అఖిల్ చేసిన రెండో సినిమా హాల్ లో పత్తా లేకుండా పోయింది. ఇక మూడో సినిమా సంగతి సరే సరీ.ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయింది కూడా ఎవరికీ తెలియదు.


వరుణ్ తేజ్ తో తొలిప్రేమ వంటి సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి డైరెక్టర్ గా ప్రేమ కథా చిత్రం ను తెరకెక్కించారు అఖిల్.  మిస్టర్ మజ్ను గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. దాంతో ఇప్పుడు అక్కినేని అభిమానుల ఆశలు అన్నీ అఖిల్ చేస్తున్న నాలుగో సినిమా మోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్ పైనే ఉన్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న గా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు టీజర్ కు మంచి స్పందన దక్కింది.

ఈ సినిమాతో తమ హీరో అఖిల్ హిట్ కొడతారని భావిస్తున్నారు ఆయన అభిమానులు.ఇకపోతే తన తదుపరి చిత్రంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక యాక్షన్ ఫిలిం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లుక్స్ ఎంతో క్యూరియాసిటీని పెంచుతోండగా సురేందర్రెడ్డి స్టైల్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది అని మాత్రం తెలుస్తోంది. అయితే అఖిల్ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన ఒకటి ఇప్పుడు టాలీవుడ్ లో ప్రచారం అవుతోంది. అఖిల్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక లవ్ స్టోరీ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: