తెలుగు లో సూపర్ హిట్ అయిన సినిమా లు హిందీ లో డబ్ కావడం లేదు రీమెక్ అవ్వడం చూస్తూనే ఉంటాం.. అక్కడ కూడా భారీ హిట్ ను అందుకుంటున్నాయి. అది తెలుగు సినిమాలకు ఉన్న పవర్ అలాంటిది.. ఇప్పుడు మరో సినిమా రిమెక్ కు రెడీ అయ్యింది.అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అల వైకుంఠపురంలో.. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.


పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను, తమన్ తన మ్యూజిక్ తో మరో మెట్టు ఎక్కించాడు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.. హిట్ కోసం రెండేళ్ళు వెయిట్ చేసిన  బన్నీకి ఈ సినిమా హ్యాట్రీక్ హిట్ ను అందించింది. ఈ సినిమా హిట్ తో ఇప్పుడు బన్నీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. అంతేకాదు..ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ కి చెందిన బడా నిర్మాతలు పోటీపడ్డారు.


త్వరలో బాలీవుడ్ లోనూ రీమేక్ కానుంది. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు.. మొత్తానికి బన్నీ కూడా బాలివుడ్ లో సందడి చేయనున్నన్నాడు.. మొన్నీమధ్య కార్తీక్ ఆర్యన్ ఇన్ స్టాగ్రామ్ లో సూపర్ హిట్ బుట్ట బొమ్మా పాటకు డ్యాన్సులు ప్రాక్టీస్ చేసిన వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ ను పోస్ట్ పోన్ చేశారు.. ప్రభావం తగ్గిన తరువాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం హిందీ వెర్షన్ ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ను అల్లు అరవింద్ బాలివుడ్ లో రీమెక్ చేయనున్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా లో నటిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: