తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా సదా హీరోయిన్ గా గోపీచంద్ విలన్ పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ ఇప్పటికీ ఫేవరెట్ సినిమాగానే కొనసాగుతోంది. 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జయం సినిమా నేటికి సరిగ్గా 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఇక ఈ సినిమాతో అటు నితిన్ సదా ఇండస్ట్రీ హీరో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో.. కొత్త వాళ్ళు కావడంతో నితిన్ సదా తో దర్శకుడు తేజ ఎంతో ఇబ్బంది పడ్డాడట.
అయితే నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఇక ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అయినప్పటికీ ఇక ప్రొడ్యూసర్ కొడుకు అని ఎక్కడా చూడకుండా సరిగ్గా నటించకపోతే ఎప్పుడూ నితిన్ పై సీరియస్ అవుతూ ఉండే వాడట దర్శకుడు తేజ. ఇక తనకు నచ్చిన విధంగా షాట్ కుదిరేంతవరకు కూడా నితిన్ ఇబ్బంది పెడుతూ ఉండేవాడట. అంతేకాదండోయ్ ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక సన్నివేశంలో సరిగ్గా నటించలేదు అనే కారణంతో ఇక హీరోయిన్ సదా చెంప చెల్లుమనిపించాడట డైరెక్టర్ తేజ. అప్పట్లో ఈ వార్త కాస్త తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ గా మారిపోయింది. ఇలా జయం సినిమా సమయంలో తేజ దర్శకత్వంలో రాటుతేలిన నితిన్, సదా లు ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలా రాణించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.