తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు ప్రస్తుతం ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీల్లో కూడా బయోపిక్ ల హవా ఎంతగానో పెరిగిపోయింది.  ప్రస్తుతం ఎంతో మంది బయోపిక్ లను తెరకెక్కించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.  క్రీడ, రాజకీయ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులకు సంబంధించిన జీవిత చరిత్రలను ఇక సినిమా రూపంలో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శక నిర్మాతలు ఎంతో ఆసక్తిగా చూపుతున్నారు.  ఇటీవల కాలంలో అటు ప్రేక్షకులు కూడా బయోపిక్ లను ఎక్కువగా ఆదరిస్తూ ఉండడంతో ఇక దర్శక నిర్మాతలు అందరికీ బయోపిక్ లు తెరకెక్కించేందుకు మరింత బూస్ట్ లభిస్తుంది.



 ఇప్పటికే అటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో రకాల బయోపిక్ తెరకెక్కించారు.  మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఏకంగా రెండు సినిమాలను తెరకెక్కించారు.  తెలుగు ప్రజల గుండెల్లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర అనే సినిమా తెరకెక్కింది .  ఇలా పలువురు రాజకీయ సినిమా రంగానికి చెందిన ప్రముఖులు బయోపిక్లో తెరకెక్కాయి.  ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న నటి,దర్శకురాలు బయోపిక్ కూడా తెరకెక్కించబోతున్న ట్లు  తెలుస్తోంది.



 తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు ఒక గొప్ప నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఇక ఆ తర్వాత దర్శకురాలిగా అవతారం ఎత్తి..  దర్శక రంగంలో కూడా మహిళా దర్శకురాలిగా తన సత్తా చాటి సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు విజయనిర్మల.  అయితే విజయనిర్మల బయోపిక్ తెరకెక్కించేందుకు ఇక ఆమె కొడుకు నరేష్ కథ సిద్ధం చేయగా ఇక ఈ బయోపిక్ కి సూపర్ స్టార్ కృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే విజయనిర్మల బయోపిక్లో ఇక ఆమె పాత్రలో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా  అయితే బాగుంటుందని భావిస్తున్నారట.  ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో వచ్చే అవకాశం టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: