క్రియేటివ్
డైరెక్టర్ సుకుమార్,
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా "పుష్ప"
సినిమా రెండు భాగాలలో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే పాన్
ఇండియా మూవీ గా విడుదల కాబోతున్న ఈ సినిమాని
సుకుమార్ హాలీవుడ్ లెవల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంతో
అల్లు అర్జున్ స్టార్డమ్ జాతీయ స్థాయికి చేరుకుంటుందని అభిమానులు సైతం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే అభిమానుల అంచనాలకు మించి
సుకుమార్పుష్ప సినిమాని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం..
సుకుమార్ ఒక పడవలో ఒక టెర్రిఫిక్ యాక్షన్ సన్నివేశాన్ని ప్లాన్ చేసారట. పుష్ప సినిమాలో ఓ బోట్ లో
హీరో అల్లు అర్జున్.. గూండాలతో భారీ ఫైట్ చేస్తారట. అయితే
సినిమా మొత్తంలో ఈ ఫైట్ హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ ఫైట్ గురించి సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది.
ఇప్పటికే పుష్పరాజ్ ఇంట్రో వీడియో లో శేషాచలం అడవుల్లో
అల్లు అర్జున్ పోలీసులను చితక బదుతూ తగ్గేదేలే అంటూ ఓ ఊర
మాస్ డైలాగ్ వదిలి అంచనాలు భారీ స్థాయికి తీసుకెళ్లారు. ఈ వీడియోలో లొకేషన్లు, సినిమాటోగ్రఫీ కూడా చాలా కొత్తగా కనిపించాయి.
దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా పూనకాలు తెప్పించింది. ఈ
సినిమా కచ్చితంగా భారత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించనుందని తెలుస్తోంది.
ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులు ప్రకటించడం తో
సుకుమార్ 'పుష్ప'
సినిమా చిత్రీకరణ
జూన్ నెల చివరి వారంలో ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో జరగనున్న ఈ చిత్రీకరణలో
అల్లు అర్జున్ పై కొన్ని షాట్స్ తీయనున్నట్లు సమాచారం. ఇకపోతే
హీరోయిన్ గా రష్మిక, ప్రతి నాయకుడిగా ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న పుష్ప సినిమాని మైత్రీ
మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.