ప్రస్తుతం బుల్లితెర పై జడ్జ్ గా దూసుకుపోతున్న ప్రియమణి సినిమా అవకాశాలు కూడా అందుకుంటూ మునుపటి కంటే ఎక్కువగా బిజీ అవుతున్నారు. ఆమె రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న నారప్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. నేషనల్ అవార్డు అందుకున్న ఏ హీరోయిన్ అయినా సినిమాల పరంగా బ్రేక్ తీసుకోకూడదని నిర్ణయించుకుంటారు కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది ప్రియమణి.

అయితే ఆ దూరం ఎక్కువ కాలం లేకపోవడం తో ఆమె కం బ్యాక్ మళ్లీ ఈజీ అయ్యింది. తమిళంలో నటించిన పరుత్తి వీరన్ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న ప్రియమణి తెలుగు తమిళ హిందీ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించి హీరోయిన్ గా మారింది. తెలుగులో పెద్ద పెద్ద హీరోలతో జోడీ కట్టిన ఆమె ఇప్పటివరకు మంచి సినిమా లు చేసుకుంటూ వచ్చింది. అయితే మునుపటిలా గ్లామర్ పాత్రలు కాకుండా పెళ్లి తర్వాత కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ వస్తుంది ప్రియమణి.

అయితే భర్త ముస్తఫా రాజ్ కారణంగానే ప్రియమణి మళ్లీ సినిమాల్లో నటించగలగు తున్నాను అని తాజాగా వెల్లడించింది ప్రియమణి.  రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ లో నటించానంటే భర్త ప్రోత్సాహంతోనే అని చెప్పుకొచ్చింది.  ఆ తర్వాత ఆమెకు వరుసగా తెలుగు హిందీ కన్నడ భాషల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. భార్య భర్తలు అన్నాక చిన్నచిన్న గొడవలు వస్తుంటాయి అని ఆ సమయంలో తన భర్త కాస్త తగ్గుతారని వెల్లడించింది. సినిమాల పరంగా తన కెరీర్లో చాలా బిజీగా ఉన్నానని తెలిపింది. హిందీలో మైదాన్, సైనైడ్, కొటేషన్ గ్యాంగ్ చిత్రాలను చేస్తున్నానని వెల్లడించింది. కరోనా కారణంగా తాను నటిస్తున్న సినిమాలకి కాస్త రెమ్యునరేషన్ నీ తగ్గించుకొని నిర్మాతకు సహకరిస్తున్నట్లు చెప్పింది ప్రియమణి.

మరింత సమాచారం తెలుసుకోండి: