సినిమాల్లో విల‌న్ అయిన‌ప్ప‌టికి స‌మాజంలో మాత్రం రియ‌ల్ హీరోగా సోనూసూద్ పేరు తెచ్చుకున్నారు.చాలా మంది తెలుగు హీరోలు కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు త‌ప్ప ఎక్క‌డా కూడా ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఆలోచ‌న వాళ్ల‌కి రావ‌డం లేదు.కానీ దీనికి భిన్నంగా సోనూసూద్ ఉన్నారు. సినిమాల ద్వారా కోట్ల రూపాయ‌లు సంపాదించి వెన‌కేసుకోవ‌డం ఆయ‌న‌కి అస‌లు తెలియ‌దు. ఎందుకంటే ఆయ‌న‌కి తెలిసిందా స‌మాజానికి సేవ చేయ‌డ‌మే. క‌రోనా మొద‌టి ద‌శ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సోనూసూద్ చాలా సేవా కార్య‌క్ర‌మాలు చేశారు.లాక్‌డైన్ స‌మ‌యంలో వ‌ల‌స‌కూలీల క‌ష్టాల‌ను చూసి చ‌లించిపోయిన ఈ రియ‌ల్ హీరో సొంత‌గా బ‌స్సుల‌ను ఏర్పాటు చేసి వారిని స్వ‌స్థ‌లాల‌కు పంపించారు.రెండ‌వ ద‌శ‌లో ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ లేక అల్లాడుతుంటే ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌నే ఏర్పాటు చేశారు. స్థానికంగా మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు అక్క‌డి ప్ర‌జ‌ల ఓట్లతో గెలిచిన వారు మాత్రం ఒక్క‌రి ప్రాణం కూడా కాపాడ‌లేదు కానీ ఆయ‌న‌కు సంబంధంలేని ప్రాంతంలో కూడా ఆక్సిజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేసి చాలా మంది ప్రాణాల‌ను సోనూసూద్ కాపాడ‌గ‌లిగారు.

ఇదే కాదు దేశంలో ఎక్క‌డైన ఎవ‌రికైన ఆప‌ద ఉంద‌ని త‌న దృష్టికి వ‌చ్చిన వారంద‌రికి ఆప‌న్న‌హ‌స్తం అందిస్తున్నారు.కూలీ చేసుకుంటూ జీవించే వారి కుటుంబాల్లో ఎవ‌రికైనా జబ్బు చేస్తే ఆసుప‌త్రికి వెళ్లే స్తోమ‌త కూడా  ఉండ‌దు. ఇలాంటి వారంద‌రి పాలిట సోనూసూద్ దేవుడ‌వుతున్నారు. చిన్న‌వ‌య‌సులోనే పెద్ద జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి సోనూసూద్ చికిత్స చేయిస్తున్నారు.కుల‌,మ‌త‌,ప్రాంతం అనే బేధం లేకుడా ఎవ‌రికి ఆప‌ద వ‌చ్చిన స‌హాయం చేస్తున్నారు.
అయితే సోనూసూద్‌కి మాత్రం ఇంకా ఒక క‌ల త‌న‌కు మిగిలి ఉందంటున్నారు. ఆ క‌ల ఎంటంటే అంద‌రికి ఉచిత వైద్యం అందించేలా ఆసుప‌త్రుల‌ను ఏర్పాటు చేయ‌డ‌మేనని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వూలో సోనూ చెప్పారు.ఉచిత విద్య‌, ఉచిత వైద్యం అందించేలా పాఠ‌శాల‌లు,ఆసుప‌త్రులు ఏర్పాటు చేయాల‌ని ఉంద‌ని..కానీ అది వెంట‌నే సాధ్యం అయ్యే ప‌నికాద‌న్నారు.ఉచిత వైద్యం అందించేందుకు ఆసుప‌త్రులను ఏర్పాటు చేయాల‌నే కోరిక ఏప్ప‌టినుంచో ఉంద‌ని అది మాత్రం ఖచ్ఛితంగా చేస్తాన‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: