ఈమధ్యనే జరిగిన  నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సంరద్భంగా మైత్రీ మూవీ మేకర్స్ క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో  బాలయ్య 107 సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ  సినిమాపై గోపీచంద్ మలినేని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్రాక్ సినిమాలగా నిజ జీవిత సంఘటనలకి తన స్టైల్ యాక్షన్ ని జోడించి ఈ సినిమాను తిస్తున్నారు అని టాక్.అయితే  ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా మొన్నటిదాకా హీరోయిన్ గా శ్రుతి హసన్ అన్నారు ఆ తర్వాత త్రిష పెరు వినిపించింది. మళ్ళీ ఇద్దరు కలిసి నటిస్తున్నారు అనే టాక్ కూడా వచ్చింది. 
అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఇద్దరు కాదట ముగ్గురు నటిస్తున్నారు అని టాక్. అయితే వాళ్ళు ఎవరు అనేది ఇంకా సస్పెన్సుగానే ఉంది. ఇక క్రాక్ సినిమాలో అదరగొట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో  చేయనున్నట్టు ఆమె ఈ మద్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఈ సినిమా కోసం ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను తో చేస్తున్న ‘అఖండ’ సినిమాని పూర్తి చేయాలని చూస్తున్నారట.
సినిమా షూటింగ్ కొంత భాగం మినహా దాదాపుగా పూర్తైయింది. ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.అలానే ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. లెజెండ్ లో విలన్ గా అదరగొట్టిన జగపతి బాబు ఈ సినిమాలో ఇంకొక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య డబల్ యాక్షన్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే టీజర్ లో వచ్చిన అఘోరా బాలయ్య గెటప్‌‌కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాల తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి తో ఇంకొక సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది మొదలుకాబోతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: