సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ వస్తున్న హ్యాట్రిక్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నా సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా కాస్త క్యాన్సిల్ అవ్వడంతో అదే బ్యానర్‌లో వెంటనే మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా ఓకే అవ్వడం అన్ని చకచకా జరిగిపోయాయి.అయితే ఈ సినిమాకి మొదటి నుంచి అడ్డకులే వస్తున్నాయి. 

మే 31న ఈ సినిమా ఓపెనింగ్ ఉంటుంది అని అందరూ అనుకున్నారు కానీ అది కరోన పరిస్థితుల మధ్య జరగలేదు.ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లండన్ లో ప్లాన్ చెయ్యాలి అని త్రివిక్రమ్ అనుకుంటే అది కూడా క్యాన్సల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మహేష్ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ ఇంకా చాలా పూర్తి కావాల్సి ఉండగా త్రివిక్రమ్ సినిమాని క్యాన్సల్ చేయాల్సి వచ్చింది. ఇలా త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.  వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు , ఖలేజా సినిమాలు ఆ రేంజ్ లో అడకపోయిన వాటికి మాత్రం చాలామంది ఫాన్స్ ఉన్నారు..ఇక ఈ సినిమాలో మహేష్ కి జోడిగా  పూజ హెగ్డే ని త్రివిక్రమ్ ఫిక్స్ చేసారని టాక్. 

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారు పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు.  గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ పరుశురాం ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు స్టయిలిష్ లుక్ లో కనిపించబోతున్నారు అని టాక్. ఇక ఈ సినిమాకి టైటిల్ తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: