టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో మూవీతో కెరీర్ పరంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సీనియర్ నటి టబు ఒక కీలక పాత్ర చేసారు.

ఇక ఈ మూవీ లోని సాంగ్స్ అయితే ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాయి. దాని అనంతరం ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప మూవీ చేస్తున్నారు. సుకుమార్ ఎంతో గ్రాండ్ లెవెల్లో మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ఎర్ర చెందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ తరువాత వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా చేయనున్న అల్లు అర్జున్, ఇటీవల తమిళ్ లో సూపర్ హిట్ కొట్టిన ఒక సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

కొద్దిరోజుల క్రితం ఆ సినిమా హక్కులను గీత ఆర్ట్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందని అలానే ఆ స్టోరీ ని మన తెలుగు నేటిటివిటి కి తగ్గట్లుగా ఒక యువ దర్శకడు ఇప్పటికే కొద్దిపాటి మార్పులు చేయడం మొదలుపెట్టారని అంటున్నారు. త్వరలో ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి అయిన అనంతరం అన్ని విషయాలు అధికారికంగా వెల్లడవుతాయని సమాచారం. మరి ఇంతకీ ఏమిటా తమిళ్ రీమేక్ మూవీ అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఈ మూవీ విషయమై పూర్తి వివరాలు తెలియాలంటే కొద్దిరోజుల వరకు వెయిట్ చేయాల్సిందే మరి ..... !!


మరింత సమాచారం తెలుసుకోండి: