సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ ప్రారంభించి తనకు ఈ సాఫ్ట్ వేర్ రంగం పనికిరాదని ఫిక్స్ అయి ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ రేంజికి ఎదిగారు కొరటాల శివ. స్వయంగా నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళికి మేనల్లుడు కావడంతో ఆయన వద్ద స్క్రీన్ రైటింగ్ విషయంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత రచయితగా ఎంట్రీ ఇచ్చి ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి లాంటి సినిమాలకు డైలాగ్ రైటర్ గా పని చేశారు.. ఆ తర్వాత బోయపాటితో సింహా లాంటి కొన్ని సినిమాలకు పని చేసినా సరే ఇద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల తాను స్వయంగా డైరెక్టర్ గా మారాలని నిర్ణయించుకున్నారు కొరటాల శివ. 

 

 

అలా ఆయన మొట్టమొదటిసారిగా ప్రభాస్ హీరోగా మిర్చి అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మహేష్ బాబుతో శ్రీమంతుడు లాంటి సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సబ్జెక్టుతో హిట్ కొట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మోహన్ లాల్ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా చేసి మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత భరత్ అనే నేను సినిమా తో మళ్లీ మహేష్ బాబు తో మ్యాజిక్ చేసి ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి క్రేజీ డైరెక్టర్ పుట్టినరోజు ఈరోజు. 

 

దీంతో ఆయన ఈరోజు అటు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇటు నందమూరి ఫ్యాన్స్ కి కూడా ఒక అదిరిపోయే ఫీస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. విషయం ఏమిటంటే ఆయన ప్రస్తుతం ఆచార్య అనే సినిమా కోసం చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి పని చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ తదుపరి సినిమా కూడా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది. 

 

ఈ నేపథ్యంలోనే కొరటాల శివ పుట్టినరోజు నేపథ్యంలో ఈ రెండు సినిమాల నుంచి ఆయా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమా నుంచి హీరోయిన్ ఎవరు అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అది కియారా అద్వానీ అయ్యుండొచ్చు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోపక్క ఆచార్య సినిమా నుంచి కూడా మంచి అప్డేట్స్ ఏవైనా రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: