తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తెలుగులో ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన వ్యక్తి. ఆయన ఇండస్ట్రీలో తనదైన మార్కెట్ సెట్ చేసుకున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ పారితోషికం ఎంత తీసుకుంటున్నాడో తెలిసిందే అందరు షాక్ అవ్వాలిసిందే. పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా అంత రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఆయన సినీ జీవితంలో అంత రెమ్యునరేషన్ తీసుకోలేదు.

అయితే విజయ్ దళపతి 100 కోట్ల రెమ్యునరేషన్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో విజయ్ నటించిన సినిమాలు అన్ని మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఆయన పారితోషికం కూడా ఎవరెస్ట్ ఎక్కేసిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈయన పారితోషికమే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంగా మారింది.

తాజాగా దళపతి విజయ్ సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు  ఆయన  80 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. అయితే గత కొన్నేళ్లుగా విజయ్ సినిమాలు వరసగా విజయం సాధిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఆయన నటించిన తెరీ, మెర్సల్, బిగిల్, సర్కార్, మాస్టర్ వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరో సినిమా సంచలన వసూళ్లు చేశాయి. ఇక ఈ సినిమాలు తెలుగులో కూడా భారీ విజయాలు అందుకున్నాయి.

దీంతో ఇప్పుడు దళపతి విజయ్ కి రెండు ఇండస్ట్రీలలో మంచి మార్కెట్ వచ్చింది. ఇక విజయ్‌కు 100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన సినిమాలు దాదాపు 300 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాయని సమాచారం. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాకు 80 కోట్లు అందుకుంటున్న విజయ్.. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 100 కోట్లు అందుకోబోతున్నాడు. అయితే దిల్ రాజు నుంచి 10 కోట్ల అడ్వాన్స్ కూడా వెళ్లిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: