సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలిసిన విషయమే. ఖాళీ సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో టూర్ ప్లాన్ చేసుకొని  ఎంజాయ్ చేస్తుంటారు . ముఖ్యంగా తన గారాల పట్టి ముద్దుల కూతురు సితారతో ఎక్కువ సమయం గడుపుతూ  తనపై తండ్రి ప్రేమను కురిపిస్తుంటాడు. అంత ప్రేమ తన తనయురాలు సీతు అంటే. అయితే తాజాగా అందుతున్న వార్త వింటే కూతురిపై స్పెషల్ ప్రేమే కాదు, స్పెషల్ నమ్మకం కూడా ఉందని అర్థం అవుతోంది. ఇటీవలే ప్రిన్స్ మహేష్ బాబు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బుల్లితెరపై కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తెలుగు ఛానల్ అయిన "స్టార్ మా" లో నిర్మాతగా ఉంటూ ఓ షోని  నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షో పిల్లలకు సంబంధించినది అని సమాచారం.
 
అయితే తన చిట్టి ప్రిన్సెస్ సితారను ఈ షో లో యాంకర్ గా చూడాలని ఆశపడుతున్నారట మహేష్. అందుకే సితారను ఈ షోలో హోస్ట్ గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక  సెలబ్రిటీ కిడ్స్ తో  ఈ షో ను ప్లాన్ చేస్తున్నారట ప్రిన్స్.  ఇందులో సితార షో కి వచ్చిన సెలబ్రిటీ పిల్లలను తమ రియల్ లైఫ్ కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ సందడి చేయనున్నట్లు వినిపిస్తోంది. స్టార్ కిడ్స్ తో ప్రోగ్రాం అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయురాలు సీతుతో ఇంతటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ రెడీ చేస్తున్నట్లు సినీ వర్గాలనుండి సమాచారం అందుతోంది.
 
అయినా సినీ తారల పిల్లలతో షో చేయడమంటే సాధారణ విషయమేమీ కాదు. అందుకు తన చిట్టి తల్లి సితారను మహేష్ ఎంపిక చేసుకున్నారు అంటే కూతురు పై ప్రిన్స్ కు ఎంత నమ్మకమో అంటూ, షో ని సక్సెస్ చేయడానికి మేము రెడీ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ప్రిన్స్ అభిమానులు మాత్రం ఈ షో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: