ఫ్యాక్షన్ సినిమాలు అంటే మన టాలీవుడ్ లో సుమోలు గాల్లోకి ఎగరడం, ట్రైన్ లు రివర్స్ లో వెళ్లడం, చంపు కోవడాలు, నరుక్కోవడాలు, భారీ డైలాగులు వంటివి మనం చూస్తాం. కానీ ఇటీవలే వచ్చిన ఓ ఫ్యాక్షన్ నేపథ్యంలోనీ సినిమాను హార్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించి ఫ్యాక్షన్ సినిమాల జోనర్ ను సరి కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. తొలి సినిమాతోనే నేషనల్ అవార్డును దక్కించుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాంబి రెడ్డి ఫ్యాక్షన్ సినిమాల్లోకెల్లా వెరైటీ ప్రయత్నంగా చేయబడ్డ సినిమా. 

2020లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా పాక్షికంగా కోవిడ్-19 వ్యాధి నేపథ్యంలో చిత్రీకరించబడినది. బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన తేజ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఆపిల్ ట్రీస్ స్టూడియోస్ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ సినిమాను నిర్మించగా ఆనంది హీరోయిన్ గా నటించింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెండున్నర కోట్ల వసూళ్లను దక్కించుకొని సూపర్ హిట్ కాగా, ఆహా ఈ సినిమా ఓ టీ టీ హక్కులను దక్కించుకుంది. స్టార్ మా శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. 9.72 టిఆర్పి రేటింగ్స్ తో బుల్లితెర లో కూడా మంచి హిట్ గా నిలిచింది జాంబి రెడ్డి.

స్నేహితుడి పెళ్లి కోసం రాయలసీమ ప్రాంతానికి వెళ్తారు హీరో మరియు అతని ఫ్రెండ్స్. అక్కడ స్నేహితుడినీ పెళ్లి చంపేందుకు ప్లాన్ చేస్తారు. ఆ విషయం ఎలాగోలా తెలుసుకున్న హీరో దాని బారి నుంచి ఫ్రెండ్ ని కాపాడాలని ప్రయత్నాలు చేస్తుండగా ఆ ప్రాంతపు సమీపంలో ఒక సైంటిస్ట్ మనిషి మీద చేసిన ప్రయోగం విఫలం కాగా ఆ మనిషి  జాంబీ గా మారుతాడు. అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన ఆ జాంబీ హీరో గ్యాంగ్ లోని ఓ ఫ్రెండ్ ని కొరకగా అతను కూడా జాంబి గా మారతాడు. అలా ఊరు మొత్తం జంబీ లు గా అయిపోతారు. మరి గ్రామంలోనీ జాంబి లుగా మారిన వారిని మామూలు మనుషులుగా హీరో ఎలా మార్చారు అన్నది అసలు కథ. 

మరింత సమాచారం తెలుసుకోండి: