బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ సినిమా పూర్తి కావడంతో ఆయన తన తదుపరి చిత్రం పై ఫోకస్ నిలిపారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నారు. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమా హిట్ కొట్టాలని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా నుంచి వచ్చిన రెండు టీజర్ లు సెన్సేషనల్ హిట్ లు అయ్యాయి. ఒక పాత్రలో ఫ్యాక్షనిస్ట్ గా, మరొక పాత్రలో అఘోరా గా నటించబోతున్నాడు బాలకృష్ణ.

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసే తదుపరి సినిమా అనౌన్స్ అయింది. ఇటీవల క్రాక్ చిత్రంతో ఘన విజయం సాధించిన దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ఈ కాంబో పై మొదటి నుంచి ఎన్నో వార్తలు వస్తూ ఉండగా ఇప్పుడు అదే నిజమైనందుకు నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకు క్రాక్ సినిమా కి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తారని తెలుస్తోంది. 

ఈ సినిమాలో కూడా శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకుంటారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే శృతిహాసన్ బాలకృష్ణతో నటించడానికి ఇంకా ఓకే చెప్పలేదట. గోపీచంద్ తో ఉన్న స్నేహం రీత్యా ఓకే చెప్పడానికి కొంత సమయం కావాలని ఆమె అడిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమె ఓకే చెప్పలేని పక్షంలో మరో ఇద్దరు హీరోయిన్ల పై ఫోకస్ పెట్టారట బాలయ్య. ఈలోపు త్రిష లేదా నయనతార తో సంప్రదింపులు జరపాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్ గా మరియు పోలీసు గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: