సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప. అల్లు అర్జున్ సినీ జీవితంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో పుష్ప మూవీ చిత్రీకరిస్తున్నారు. ఇక దర్శకుడు సుకుమార్ తన శైలికి భిన్నంగా ఈ సినిమాలో హీరోను ఊరమాస్ గా చూపించబోతున్నారు. సుకుమారీ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ ఏడాదే పుష్ప పార్ట్1 రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ చిత్రంలో బోట్ బ్యాక్ డ్రాప్ లో ఒక సీన్ ఉంటుందని ఆ సీన్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని సమాచారం.

అయితే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని అన్నారు. ఇక బోట్ ఫైట్ గతంలో చూసిన బోట్ ఫైట్లతో పోలిస్తే భిన్నంగా, రిచ్ గా సుకుమార్ చిత్రీకరిస్తునట్లు తెలిపారు. అలాగే మరోవైపు అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు విలన్ గా ఫ‌హ‌ద్ ఫాజిల్ నటిస్తుండగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు.

ఇక మరోవైపు సుకుమార్ శిష్యుడు, ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా పుష్ప పార్ట్ 1 పది కేజీఎఫ్ లకు సమానమని వెల్లడించారు. అంతేకాదు.. ప్రశాంత్ నీల్ టేకింగ్, మాస్ ఎలివేషన్స్ కేజీఎఫ్ ఛాప్టర్ 1కు హైలెట్ గా నిలవగా సుకుమార్ బన్నీని ఏ విధంగా చూపించారో చూడాల్సి ఉందన్నారు. ఇక ఇప్పటికే పుష్పపై అంచనాలు పెరగగా బుచ్చిబాబు చెప్పిన మాటలు ఆ అంచనాలను మరింత పెంచుతుండటం గమనార్హం అని చెప్పాలి. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు.. యాంకర్ అనసూయ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: