అయితే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని అన్నారు. ఇక బోట్ ఫైట్ గతంలో చూసిన బోట్ ఫైట్లతో పోలిస్తే భిన్నంగా, రిచ్ గా సుకుమార్ చిత్రీకరిస్తునట్లు తెలిపారు. అలాగే మరోవైపు అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు విలన్ గా ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు.
ఇక మరోవైపు సుకుమార్ శిష్యుడు, ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా పుష్ప పార్ట్ 1 పది కేజీఎఫ్ లకు సమానమని వెల్లడించారు. అంతేకాదు.. ప్రశాంత్ నీల్ టేకింగ్, మాస్ ఎలివేషన్స్ కేజీఎఫ్ ఛాప్టర్ 1కు హైలెట్ గా నిలవగా సుకుమార్ బన్నీని ఏ విధంగా చూపించారో చూడాల్సి ఉందన్నారు. ఇక ఇప్పటికే పుష్పపై అంచనాలు పెరగగా బుచ్చిబాబు చెప్పిన మాటలు ఆ అంచనాలను మరింత పెంచుతుండటం గమనార్హం అని చెప్పాలి. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు.. యాంకర్ అనసూయ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారని సమాచారం.