ఆర్య మూవీతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన సుకుమార్ సూపర్ హిట్ కొట్టారు. అల్లు అర్జున్, అను మెహతా హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. ఆ తరువాత నుండి దర్శకుడిగా వరుసగా అవకాశాలతో కొనసాగిన సుకుమార్ మంచి సక్సెస్ లను అందుకోవడంతో పాటు ఆడియన్స్ నుండి బాగా పేరు దక్కించుకున్నారు.
ఇక ఇటీవల రామ్ చరణ్, సమంత ల కలయికలో సుకుమార్ తీసిన రంగస్థలం మూవీ అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ ని సొంతం చేసుకుంది. 1980ల కాలం నాటి కథగా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సుకుమార్మూవీ ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా స్టోరీ వినిపించే సమయంలో చరణ్ కి మరొక కథ కూడా చెప్పారట సుకుమార్.
ఆ కథ విషయమై ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, చరణ్ ఇద్దరూ సుకుమార్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. నిజానికి అప్పట్లో చరణ్ కి ఆ కథ కూడా బాగా నచ్చిందని, అయితే రంగస్థలం పూర్తి అయ్యాక అది చేద్దాం అని ఆయన అన్నారట. కాగా ఆ స్టోరీ యాక్షన్ డ్రామాగా సాగడంతో పాటు విభిన్న జానర్ లో సాగుతుందని టాక్. ప్రస్తుతం చిరంజీవి ఫోన్ కాల్ తో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన సుకుమార్, త్వరలో ఆ స్టోరీ యొక్క పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే మరొక్కసారి చరణ్, సుకుమార్ ల కాంబోలో తెరకెక్కనున్న మూవీ ప్రకటన రాబోయే మరికొద్దిరోజుల్లో రావచ్చని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియదుగాని ఈ న్యూస్ మాత్రం టాలీవుడ్ వర్గాల్లో ఎంతో వైరల్ అవుతోంది .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: