టాలీవుడ్ లో నటి రీమాసేన్ అంటే ఎవరో తెలియని ప్రేక్షకులు దాదాపు ఉండరు అని చెప్పాలి. పదిహేనేళ్ల వయసులోనే వెండితెరపై కనిపించి ఎంతో మంది ప్రేక్షకులను తన ఫ్యాన్స్ గా మలుచుకుంది.  చిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది రీమ. మొదటి సినిమాతోనే తన నటనతో అందంతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈమె మంచి స్టార్ డమ్ ను సంపాదించుకుంది. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలీవుడ్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది.

తెలుగులో ఆ తర్వాత ఆమె చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన మనసంతా నువ్వే, వల్లభ వంటి చిత్రాల్లో చేసిన అద్భుతమైన నటన కు గాను స్టార్ హీరోయిన్ అయింది. దాదాపు 40 చిత్రాలకు పైగా నటించి కుర్రకారు మతులు పోగొట్టిన ఆమె మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకని తాను ఎంత గొప్ప నటినో చెప్పింది. ఆమెకు ఉన్న క్రేజ్ ను చూసి ఇతర భాషల దర్శకనిర్మాతలు కూడా ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకునేందుకు క్యూలు కట్టారు. తమిళ హిందీ  భాష లలో సైతం ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

అయితే కెరీర్ మంచి ఊపు మీద ఉండగానే ఆమె 2012లో పెళ్లిపీటలు ఎక్కింది. ప్రముఖ వ్యాపారవేత్త శివకరణ్ తో ఏడడుగులు నడిచింది రిమా. వీరికి రుద్రవీర్ అనే కొడుకు కూడా జన్మించాడు. అప్పటి నుంచి ఎక్కువగా సినిమాలు చేయట్లేదు.  నటనకు గుడ్ బోయ్ చెప్పేసి పూర్తి సమయాన్ని ఫ్యామిలీ కే కేటాయిస్తోంది. అయితే సినిమాలలో చేస్తున్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అదే అందాన్ని మెయింటెన్ చేస్తుంది హీరోయిన్. ఇటీవలే తన కొడుకు భర్త తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫ్రెండ్స్ తో పార్టీ లు చేసుకున్న ఫోటోలు కూడా పంచుకుంది. మొత్తానికి తన సినిమా జీవితం లాగానే వ్యక్తిగత జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: