స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురములో మూవీ తో భారీ విజయం సొంతం చేసుకుని జాతీయ స్థాయిలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించిన అల్లు అర్జున్, పుష్ప తో కూడా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.
ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప మూవీ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా గంధపు చెక్కల స్మగ్లింగ్ కథా నేపథ్యంలో పలు యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా పుష్ప తెరకెక్కుతున్నట్లు టాక్. ఈ మూవీ మొదటి భాగం ఆగష్టు 13న విడుదల కానుంది. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా పడే ఛాన్స్ కనపడుతోంది. ఇక పుష్ప మొదటి భాగం తరువాత ఐకాన్ మూవీ అల్లు అర్జున్ చేయనున్నారని, ఆ తరువాతనే పుష్ప సెకండ్ పార్ట్ షూట్ మొదలవుతుందని ఇటీవల అల్లు అర్జున్ మిత్రుడైన టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించారు.
కాగా ఐకాన్ మూవీని దిల్ రాజు నిర్మించనుండగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. మంచి యాక్షన్ కలగలిపిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఐకాన్ కూడా పాన్ ఇండియా రేంజ్ మూవీగా తెరకెక్కనుంది అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఐకాన్ కథకు యూనివర్సల్ అపీల్ ఉందని భావించిన దర్శకనిర్మాతలు దీనిని కేవలం తెలుగు కు మాత్రమే పరిమితం చేయకూడదని భావించి పాన్ ఇండియా రేంజ్ లో భారీ వ్యయంతో అత్యున్నత స్థాయిలో నిర్మించనున్నారని, అల్లు అర్జున్ కూడా అందుకు పచ్చ జెండా ఊపారని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే బన్నీ ఫ్యాన్స్ కి ఇది మంచి పండుగ న్యూస్ అనే చెప్పాలి ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: