తెలుగులో కొంతమంది సినిమాలు చేయడం ద్వారా  అదృష్టాన్ని కొనితెచ్చుకుంటారు వారిలో హీరోయిన్లే ఎక్కువ. ఇప్పుడు బాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరోయిన్ లు తెలుగులో మొదటి సినిమా చేసి ఆ తర్వాత అక్కడకి వెళ్లి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారే. మల్లీశ్వరి సినిమా తో కత్రినాకైఫ్, లోఫర్ సినిమా తో దిశాపటాని.. వీరిద్దరూ తెలుగులో తన మొదటి సినిమా చేసుకుని ఆ తర్వాత బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోని ఇప్పుడు స్టార్ హీరోయిన్ లు గా వెలుగుతున్నారు.

ఆ విధంగా ఇప్పటి తరం హీరోయిన్లు కూడా తెలుగు సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత ఇతర భాషల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుని స్టార్ లు గా ఎదుగుతున్నారు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక ఆ తర్వాత వరుస తెలుగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇప్పుడు బాలీవుడ్ లో హవా చూపిస్తోంది. తెలుగులోనూ మంచి మంచి సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి ఇప్పుడు. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా తెలుగులో ఒక సినిమా చేసి అదృష్టం కలిసి రాక బాలీవుడ్ కి వెళ్లి అదృష్టాన్ని కొని తెచ్చుకొని మళ్లీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఆమె చేతిలో ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ సినిమాలే ఉన్నాయి. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, హరీష్ శంకర్ పవన్ ల మూవీ..  ఈమె చేస్తున్న సినిమా లు. వీరే కాకుండా టాలీవుడ్ లో సినిమా లు చేసి బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు.కియారా అద్వానీ, మాళవికా మోహనన్, నజ్రియా లాంటి హీరోయిన్లు టాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి వీరు టాలీవుడ్ నుంచి వెళ్లి ఏ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: