తెలుగు సినిమా పరిశ్రమలో తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకుల ను ఎంతగానో అలరించిన దర్శక దిగ్గజం కె విశ్వనాథ్. ఎన్నో అద్భుతమైన సినిమాలు ఈయన చేతుల నుంచి ప్రేక్షకులకు వచ్చాయి. మంచి కథ, అంతకుమించిన సంగీతంతో ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించారు. ఇతడితో సినిమాలు చేయడం తమకు దక్కిన గౌరవంగా భావించేవారు హీరోహీరోయిన్లు. అలాంటి దర్శకుడు కె.విశ్వనాధ్ కి ఓసారి సెట్ లో జరిగే ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డారు. 

అక్కినేని నాగేశ్వ రావు, సావిత్రి, జమున కీలకపాత్రలలో మూగమనసులు సినిమా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు కె.విశ్వనాథ్. కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే హైదరాబాదులోని సారధీ స్టూడియోస్ లో షూట్ చేశారు. అలా ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్ సారథి స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. నటీమణి జమున మేకప్ మేకప్ చేసుకుంటున్నారు. ఆమెకు ఓల్డ్ గెటప్ చేస్తున్నారు దీంతో ఆమెకు సూట్ అయిందో లేదో అని చూసేందుకు విశ్వనాథ్ వెళ్లారు ఆమెను చూసి బాగానే ఉంది అనుకొని వెనక్కి తిరిగి వచ్చాడు .

సెట్ లో అడుగుపెట్టగా నే  ఓ కట్టర్ జారి పడింది. దెబ్బ తగలడం తో రక్తం జలజల కారింది. వెంటనే ఆ సినిమా హీ రో అక్కినేనితో పాటు హీరోయిన్లు సిబ్బంది అంతా అక్కడ గుమి కూడారు. రక్తం బాగా రావడంతో ఏఎన్ఆర్ చలించిపోయి వెంటనే ఆ గాయాన్ని శుభ్రం చేసి రక్తం రాకుండా ఆపారు.  ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లి కుట్లు వేయించుకుని తీసుకువచ్చారు. అనంతరం షూటింగ్ యధావిధిగా కొనసాగింది. రెండు రోజుల పాటు ఆయన రెస్ట్ తీసుకొని మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నారు. విశ్వనాద్ దర్శకత్వంలో ఎలాంటి సినిమాలు వచ్చాయో మనం అందరం చూశాం.. ఎన్నో గొప్ప సంగీత ప్రాధాన్యమైన చిత్రాలు రావడం మనం చూశాం..

మరింత సమాచారం తెలుసుకోండి: