అయితే దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ కూడా పేద ప్రజల పరిస్థితి దుర్భరంగా మారిపోయింది. అదే సమయంలో అటు ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో కరోనా సమయంలో బయటపడింది. అయితే కరోనా కష్టకాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ప్రజలకు అండగా నిలిచి అటు ఇది ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఇటీవలే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా బాధితులు ఆదుకోవడం కోసం తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షల రూపాయలను అందించారు విజయ్ సేతుపతి.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ను ఆయన కార్యాలయంలో కలిసి ఇక 25 లక్షల రూపాయల చెక్కును సమర్పించారు అయితే ఇక విజయ్ సేతుపతి ఇచ్చిన 25 లక్షల రూపాయలను ఆసుపత్రిలో కరోనా రోగులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్ సేతుపతి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. కేవలం తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్నారు విజయ్ సేతుపతి.