సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య వరస హిట్స్ తో మంచి ఊపులో ఉన్నారు దానితో ఆయన కొత్త సినిమా మీద అంచనాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి.ఆయన అభిమానులు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ నటిస్తుంది. ఈ సినిమా కథ బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల గురించి ఉంటుందని టాక్.అలానే ఈ సినిమా కోసం మహేష్ బాబు ధర్మశాలకి వెళ్లబోతున్నారు అని టాక్.

అక్కడ సర్కారు వారి పాటకి సంబంధించిన ఒక ముఖ్యమైన సన్నివేశం షూట్ చేస్తారట.  ఇక ఈ సినిమాలో మాస్ అంశాలతో పాటు  కామెడీ కి కూడా పెద్ద పీట వేస్తున్నారట.ఇక ఈ మద్యనే దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. దీని తర్వాత ధర్మశాలలో మరియు  హైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్స్ ను పూర్తి చేయాలని మూవీ టీం అనుకుంటున్నారట. కరోనా సెకండ్ వేవ్ రావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది.ఈ మద్యనే  కరోనా ప్రభావం మెల్లగా తగ్గుతుండటంతో ఈ సినిమా రెండవ షెడ్యూల్ ను మళ్ళీ మొదలుపెట్టబోతున్నారు మూవీ టీం.ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమాని మొదలుపెట్టబోతున్నాడు .

సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవాల్సింది కానీ లాక్డౌన్ వలన ఆలస్యం అయింది.ఇక ఈ సినిమాలో కూడా ఆయన కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు ఓ రేంజ్ లో హిట్ అవ్వకపోయిన మంచి పేరు మాత్రం సంపాదించుకున్నాయి. అయితే ఈ సినిమాతో మహేష్ త్రివిక్రమ్ కాంబో కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనిలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజ హెడ్గే నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: