టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న rrr సినిమాలో నటిస్తున్న తారక్. దీని అనంతరం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ వంటి అగ్ర దర్శకులతో తదుపరి సినిమాలు చేయనున్నాడు. అయితే షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ దొరికితే చాలు తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంటాడు ఈ హీరో.సినిమాల విషయంలో ఎంత బిజీగా ఉన్నా.. తన భార్య, పిల్లల గురించి అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాడు.ఇక ఇటీవలే కరోనా బారిన పడ్డ ఎన్టీఆర్ దాదాపు 14 రోజుల క్వారంటైన్ తర్వాత సురక్షితంగా బయటపడ్డారు.

ఇక ప్రస్తుతం తన ఫ్యామిలీ తోనే గడుపుతున్నాడు ఎన్టీఆర్.కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో షూటింగ్ లు వాయిదా పడటం తో ఎన్టీఆర్ ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇక ఇదిలా ఉంటె ఎన్టీఆర్ ఫ్యామిలీ కి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తోంది. త్వరలోనే తన భార్య, పిల్లలను అమెరికా పంపించడానికి ఎన్టీఆర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.తన భార్య లక్ష్మీ ప్రణతికి బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉండటంతో..ఆ బిజినెస్ కి సంబంధించి ఓ కోర్స్ కోసం అమెరికా వెళ్లనుందట.అయితే తనతో పాటుగా పిల్లల్ని కూడా అమెరికా తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ.. ఫిల్మ్ నగర్ లో ఈ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' సినిమాలో నటిస్తున్న తారక్ దాని అనంతరం కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కు సంబంధించి అధికార ప్రకటన కూడా వెలువడింది.గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఈ తాజా ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో ఎన్టీఆర్ ఓ పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు.ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించి ఇంకా అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: