సంక్రాంతి కి  క్రాక్ సినిమాతో మళ్ళీ ఫామ్  లోకి వచ్చిన రవితేజ అదే జోష్ లో ఖిలాడి సినిమాను లైన్ లో పెట్టాడు. రవితేజకి ఒక్క సక్సెస్ తన కెరీర్ లో ఇంకొక లెవెల్ కి తీసుకొని వెళ్ళింది. ఆయనకి బాగా కలిసొచ్చిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆయన కెరీర్ ని కూడా గాడిలో పడేసింది. ఇక  ఇప్పుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ ను నిలిపివేశారు.

అయితే ఈ సినిమాతో రవితేజ చాలా రిస్క్ చేస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది. అదేంటి అంటే ఖిలాడి సినిమాకి మొదటిసారి ఆయన ఏకంగా 15 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. క్రాక్ హిట్ తో రవితేజ రెమ్యూనరేషన్ బాగా పెంచాడు అయితే ఇంత రెమ్యూనరేషన్ తీసుకొని సినిమా ప్లాప్ అయితే మాత్రం ఆయనకి నిజంగానే కష్టం. ఎందుకంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటే సినిమా ప్లాప్ అయ్యాక చాలామంది హీరోస్ రెమ్యూనరేషన్ తిరిగి ఇస్తారు. అలా రవితేజ కూడా ఇవ్వాల్సివస్తే అది ఆయన కెరీర్ కి చాలా పెద్ద దెబ్బ అవుతుంది.

ఇక ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. ఖిలాడీపై టీజర్ తోనే భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే భారీ ఓటిటి ఆఫర్స్ ని ఈ సినిమా కాదు అనుకోని మరి థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు మూవీ టీం . ఇక ఖిలాడి లో రవితేజ కి సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత దేవి శ్రీ ప్రసాద్ రవితేజ సినిమాకి సంగీతం అందించడం విశేషం. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో  విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: