టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు మహేష్..అయితే కేవలం సినిమాలే కాకుండా పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలే జిఎంబీ అనే సొంత నిర్మాణ సంస్థ కు స్థాపించి.. పలు సినిమాలను నిర్మిస్తున్నారు.తాజాగా అడవి శేష్ హీరోగా నటిస్తున్న 'మేజర్' సినిమాని ఈ హీరోనే నిర్మిస్తున్నాడు. అయితే ఇదిలా ఉంటె ఇప్పుడు మహేష్ మరో మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. తన కూతురు సితార తో ఒక కిడ్స్ షో ని ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇక ఇప్పటికే సితార పాపకు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అంతేకాదు ఆ మధ్య మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏకంగా మహేష్ నే ఇంటర్వ్యూ చేస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండ్రస్టీ గా మారింది సితార. ఈ నేపథ్యంలో త్వరలోనే బుల్లితెర ప్రముఖ టీవీ చానల్ స్టార్ మా లో తన కూతురితో ఓ కిడ్స్ షో ను ప్లాన్ చేయడానికి సన్నాహాలు జరుపుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ షోకి మహేష్ నిర్మాతగా వ్యవహరింబోతున్నాడట.

 ఇక దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ.. ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.మరి ముందు ముందు దీనిపై మహేష్ ఏమైనా అప్డేట్ ఇస్తాడేమో చూడాలి. ఇక మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే దుబాయ్ లో ఓ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: