పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు కనబరుస్తున్నాడు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాల్లో స్పీడు పెంచాడు. వరుస సినిమాలను ఓకే చేస్తూ రెండు సినిమాలను ఏకకాలంలో చేస్తున్నాడు. వకీల్‌సాబ్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’తో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌నూ చేస్తున్నాడు. త్వరలోనే హరీ‌శ్ శంకర్‌తో చేయనున్న సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురానున్నాడని టాక్ నడుస్తోంది.
అయితే ప్రస్తుతం కరోనా రెండే వేవ్ దెబ్బకు వపన్ సినిమాల చిత్రీకరణ ఆగింది. వీటిని రీస్టార్ట్ చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. దాంతో క్రిష్ ‘హరిహర వీరమల్లు’ కోసం లొకేషన్స్ చెక్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే ఓ వార్త సోషల్ మీడియాలో ఊపేస్తుంది. లోకేషన్స్‌లో భాగంగా క్రిష్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను స్పెయిన్‌లో చిత్రీకరించాలని ప్లాన్ చేశాడట. దీనికి సంబంధించిన వివరాలను పవన్‌కు చెప్పడంతో విదేశాలకు వద్దంటే వద్దని పవన్ అన్నాడట. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు బాగలేవని, అక్కడికి వెళ్లాక అనుకోనిదేమైనా జరిగితే ఇబ్బంది పడతామని పవన్ అంటున్నాడట. దీనిపై పవన్‌కు నచ్చ చెప్పేందుకు క్రిష్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అంతగా విదేశాల్లోనే చిత్రించాలంటేమరికొన్నాళ్ళు ఆగుదామని పవన్ అంటున్నాడట. మరి ఈ విషయంలో ఏ నిర్ణయానికి వస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఫైట్స్ చేయనున్నాడట. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ వాయిస్ ఓవర్ ఉండనుందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్దమయిందట. దీంతో పాటుగా ఈ సినిమాలో పవన్ చేయనున్న ఫైట్స్ ఊహలకు అందవని టాక్ నడుస్తోంది. ఇందులో పవన్‌ పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ఉన్నాయట. అవి ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాయని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తుందని సమాచారం. ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: