బద్రి సినిమా ద్వారా రేణు దేశాయ్ టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తో ఈమె జీవితం మలుపు తిరిగింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా వల్ల ఆయన పరిచయం వల్లనే పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రేణుదేశాయ్. టాలీవుడ్లో మొత్తంగా ఆమె రెండు సినిమాలు చేయగా వాటిలో రెండు పవన్ కళ్యాణ్ తోనే చేశారు. జేమ్స్ పండు అనే మరో తమిళ సినిమాలో కూడా ఆమె నటించారు.

ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చి కొడుకు కూతురు తో కలిసి పుణె లో నివాసం ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను వెల్లడించే రేణు దేశాయ్ ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో గొడవ పడింది కూడా. బుల్లితెరపై కూడా ఆమె తన సత్తా చాటుతోంది. కొన్ని ఫేమస్ షోలకు జడ్జ్ గా చేస్తోంది. డైరెక్టర్సినిమా కూడా ఆమె ఇదివరకే చేసింది. రేణు దేశాయ్ పూణేలోని ఎడ్యుకేషన్ సొసైటీ లో కాలేజీ విద్యను పూర్తి చేశారు. ఈమెకు ఒక అక్క ఓ తమ్ముడు ఉన్నారు. వాళ్ల తల్లిదండ్రులకు రెండో సంతానం రేణు. అయితే రెండో సారి కూడా ఆడపిల్లేనా అని తండ్రి చిరాకుతో చూడడానికి హాస్పిటల్ కి కూడా రాలేదని ప్రోగ్రాంలో చెప్పుకొచ్చారు ఆమె.

జీవితం మొత్తం కష్టాలనే అనుభవిస్తున్నాను అని చెప్పిన రేణు దేశాయ్ 2009లో పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకొని 2012లో కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఉన్న  ఆస్తుల గురించి ఒకసారి తెలుసుకుందాం. రేణు దేశాయ్ కి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మూడు కోట్ల విలువైన ఇల్లు ఉంది. మూడు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. రేణు హీరోల్లో పవన్ కళ్యాణ్ అమితాబచ్చన్ హీరోయిన్స్ లో శ్రీదేవి ని ఇష్టపడుతుంది. లండన్ ఆమెకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఒక్కో సినిమాకు 65 లక్షలు తీసుకునే రేణు నెట్వర్త్ 35 కోట్లు ఉంటుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: