టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'RRR'.జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాని దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్ తో డి. వి.వి. దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్స్, హీరోల పరిచయ టీజర్లు భారీ రెస్పాన్స్ ని కనబర్చడమే కాకుండా..సినిమాపై అంచనాలను రెట్టింపు చేసాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా పడింది.దాదాపు 90 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది.

సినిమాకు సంబంధించి ఇంకా క్లైమాక్స్ సన్నివేశాలతో పాటుగా,కొన్ని పాటల షూటింగ్స్ ఇంకా మిగిలి ఉన్నాయట.ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్ళీ పునఃప్రారంభం కానుందని తెలుస్తోంది.అందుతున్న సమాచారం ప్రకారం జులై మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాలని రాజమౌళి అండ్ టీమ్ భావిస్తోందట.ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ని మొదలెట్టేందుకు రాజమౌళి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు.కేవలం అతి కొద్ది మందితోనే మొదట ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించాలని చేస్తున్నాడట జక్కన్న.అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి అయినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇప్పటికే హీరోలకు,మరియు సినిమాలో నటిస్తున్న కీలక నటీ నటులకు.. మరోవైపు సాంకేతిక నిపుణులకు జులై మొదటి వారం నుండి షూటింగ్ కి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చే సమస్యే లేదని..విరామం లేకుండా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాడట మన జక్కన్న.మరి ప్రస్తుత పరిస్థితుల్లో అది వర్కవుట్ అవుతుందా?అనేదే గమనార్హంగా మారింది.ఇక ఈ సినిమాను అక్టోబర్ 13 న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించగా..ప్రస్తుతం పరిస్థితుల్లో అది జరిగేలా కనిపించడం లేదని అంటున్నారు విశ్లేషకులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: