ఒక్కప్పటి స్టార్ హీరో సిద్దార్థ్ అందరికి సుపరిచితమైన వ్యక్తి. బొమ్మరిల్లు, నువువొస్తానంటే నేను వద్దంటానా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సిద్దార్థ్ కి టాలీవూడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఆయన సినిమాలకు గతంలో రూ.10 కోట్ల వరకు మార్కెట్ ఉంది. అయితే సిద్దార్థ్ నటించిన సినిమాలన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఆయన ఇండస్ట్రీకి కొంచెం విరామం ఇచ్చారు. ఇక 8 ఏళ్ళ తర్వాత సిద్దార్థ్ తెలుగులో ఓ స్ట్రైట్ మూవీలో నటించబోతున్న సంగతి అందరికి తెలిసిందే.

ఆ సినిమాను తెలుగులో మహాసముద్రంగా తెరకెక్కిస్తున్నారు. అయితే 2018వ సంవత్సరంలో ‘ఆర్.ఎక్స్.100’ వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే అదే సినిమాలో సెకండ్ సెకండ్ హీరో పాత్రలో సిద్దార్థ్ కనిపిచబోతున్నారని సమాచారం.

ఇక ఇదిలా ఉండగా.. ఈ చిత్రం కోసం సిద్దార్థ్ మంచి పారితోషికం అందుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ‘మహాసముద్రంకు గాను సిద్ధార్థ్ రూ.3 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఉద్దేశంతో ఇతను అడిగినంత నిర్మాతలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కనుక హిట్ అయితే సిద్దార్థ్ కు ఇలాంటి మంచి పాత్రలు టాలీవుడ్లో మరిన్ని వచ్చే అవకాశం ఉందని చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తుంది.

అంతేకాక.. అనిల్ సుంకర తన ‘ఎ.కె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అదితి రావు హైదరి,అనూ ఇమాన్యుల్ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 19న విడుదల చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: