తెలుగులో మొట్టమొదటి ఓటీటీ తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్న ఆహా కంటెంట్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. అవడానికి యూనిక్ కంటెంట్ అవుతున్నా సరే ప్రేక్షకులను ఎంగేజ్ చేసేంత పర్ఫెక్ట్ కంటెంట్ ఒకటి కూడా ఆహాలో పడలేదు అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆహా మరింత పుష్ చేయడానికి ముందుకు వెళుతోంది ఆహా యాజమాన్యం. అల్లు అరవింద్ తో కలిసి మై హోమ్ సంస్థల అధినేత రామేశ్వర్ రావు కుమారుడు ఆహా యాప్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 


ప్రస్తుతానికి టీవీ9 సహా 10 టీవీ కూడా రామేశ్వరరావు కంట్రోల్ లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రెండు ఛానల్స్ ద్వారా ఆహా కంటెంట్ ని పుష్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం టీవీ9 కొత్త భవనం ప్రారంభం అవుతోంది. ఈ క్రమంలో ఆహా కార్యకలాపాలు కూడా ఈ టీవీ9 కొత్త భవనం నుంచే ప్రారంభించే లాగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు టీవీ9 నేమ్ బోర్డుతో పాటు ఆహా నేమ్ బోర్డ్ కూడా ఆ భవనానికి తగిలించడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. 


కేవలం కంటెంట్ పుష్ చేయడం కోసమే అల్లు అరవింద్ కి ఆహా బాధ్యతలు అప్పగించారని, కానీ అందుకు ఆయన సమర్థవంతంగా కంటెంట్ పుష్ చేయలేకపోతున్నారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే టీవీ9 ఆఫీస్ లోనే ఈ ఆహా ఆఫీస్ కూడా ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో మై హోమ్ సంస్థల ఆధ్వర్యంలోనే ఈ యాప్ ని మరింత ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఒకసారి వివాదాస్పదం కావడం మినహా ఆహాలో ఉన్న కంటెంట్ ఎప్పుడూ పెద్దగా ప్రేక్షకాదరణ దక్కించుకున్న దాఖలాలు లేవు. మరి పూర్తిగా మై హోం కంట్రోల్ లోకి వెళితే ఆహా యాప్ కి ఏమైనా మంచి అవకాశాలు లభిస్తాయి ఏమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aha