హీరో నితిన్ వరుస ఫ్లాప్ లతో కుదేలవుతున్నాడు. భీష్మ సినిమా హిట్ తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ లు గా నిలిచాయి. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన చెక్ సినిమా తొలి రోజునే చెక్కేయగా ఇలా ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ప్రేమ కథ చిత్రం రంగ్ దే ఎలాంటి పాజిటివ్ టాక్ ను చూడకుండానే ఫ్లాప్ గా వెనుదిరిగింది. దాంతో ఇప్పుడు ఆయన తన తదుపరి సినిమాతో తప్పకుండా హిట్ కొట్టిన పరిస్థితి ఏర్పడింది. 

దానికి తగ్గట్లుగానే ఆయన బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాధున్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నితిన్ అంధుడి గా నటిస్తున్నాడు. నభా నటేష్ హీరోయిన్ గా చేస్తుండగా స్టార్ హీరోయిన్ మిల్కీబ్యూటీ తొలిసారీ నెగిటివ్ రోల్ లో కనిపించబోతుంది. కరోనా తర్వాత ఈ సినిమా తిరిగి షూటింగ్ కూడా ప్రారంభించుకుంది. త్వరలోనే విడుదల కాబోతుంది. 

సినిమా తర్వాత నితిన్ స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా బదులు ఓ కొత్త దర్శకుడు ని నితిన్ లైన్లో పెట్టినట్లు సమాచారం. ప్రముఖ ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ ని నితిన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నాడు. మ్యస్ట్రో సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నా శేఖర్ ఆయన ఈ సినిమా కి పనిచేస్తున్న టైం లో ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడట. దాన్ని విని ఫిదా అయిపోయిన నితిన్ వెంటనే ఈ సినిమా ను తెరకెక్కించే ఆలోచన చేస్తున్నాడట. మ్యాస్త్రో సినిమా అటు ఇటు అయిన ఈ సినిమా తనను కాపాడుతుందని నమ్మకం వెళ్లపరుస్తున్నాడు నితిన్. మరి ఈ ఫార్ములా అయినా ఆయనకు హిట్ తెస్తుందా చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: