తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాత గా కొనసాగుతూ టాప్ హీరోలతో మరియు చిన్న హీరోలతో, లేడీ ఓరియెంటెడ్ సినిమాలను సైతం చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు దిల్ రాజు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్న నిర్మాత ఎవరు అంటే దిల్ రాజు అని చెప్పొచ్చు. ఈయన నిర్మాణ సంస్థలో చాలా సినిమాలు ఇప్పుడు నిర్మాణం జరుపుకుంటున్నాయి. దాదాపు అర డజను సినిమాలకు పైగా ఆయన నిర్మాణాలు ఒకేసారి చేస్తున్నాడు. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని  ఒకేసారి చేయడం పెద్ద రిస్క్ అని చెప్పాలి. మరి ఆయన చేసిన సినిమాలు అంటే ఇప్పుడు చూద్దాం.

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న f3 చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. తమన్నా మెహరీన్ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్2 సినిమాకి సీక్వెల్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసే దిల్ రాజు ప్రస్తుతం షాహిద్ కపూర్ హీరోగా తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీ రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం.

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ల కాంబో లోని సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తుఎన్నడూ.  భారీ బడ్జెట్ సినిమాగా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో నిర్మితమవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్  సలార్ చేస్తున్నాడు.  ఇదే కాకుండా మరో సినిమాను కూడా దిల్ రాజు వీరి కాంబినేషన్లో సెట్ చేసి ఉంచాడు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడం విశేషం. వంశీ పైడిపల్లి విజయ్ దళపతి ల కాంబినేషన్ లో ని సినిమా కి, బోయపాటి సూర్య కాంబినేషన్లో సినిమా కి , నాగచైతన్య విక్రమ్ కె.కుమార్ సినిమా కి దిల్ రాజు నిర్మాత. రౌడీ బాయ్స్ వంటి చిన్న చిత్రాలను కూడా ఆయన  నిర్మిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: