టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కథానాయిక ఆర్తి అగర్వాల్.. హిందీ సినిమాల ద్వార సినిమాల్లోకి ప్రవేశించిన ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ లో వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమెకు వరుస పెద్ద అవకాశాలు రావడంతో కొన్ని సినిమాల తోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఎన్టీఆర్, చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ, ప్రభాస్ వంటి హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది. 

ఈ నేపథ్యంలో ఆమె తన చెల్లిని టాలీవుడ్ లో సినిమా హీరోయిన్ గా చేసింది. తొలి సినిమా గంగోత్రితోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అతిథి అగర్వాల్ చాలా సినిమాల్లో నటించింది. అక్క తగ్గ చెల్లె గా ఆమె నటించిన తీరుకు తెలుగు ప్రేక్షకులు దాసోహం అయ్యారు. అయితే శ్రీ ఆంజనేయం సినిమా లో ఆమె చేసిన గ్లామర్ షో కి అక్క ఆర్తి అగర్వాల్ ఇలాంటి పాత్రల్లో నటించడం కంటే వెళ్లిపోవడం మేలు అని ఆమెను ఇంటికి పంపించేసింది.

ఈ సమయంలోనే హీరో తరుణ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఆర్తీఅగర్వాల్ అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. కానీ తరుణ్ తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించలేదు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆర్తి బలవన్మరణానికి పాల్పడింది. తన అక్క జీవితాన్ని దగ్గరగా చూసిన అదితి అగర్వాల్ ప్రేమ పెళ్లి అంటేనే విరక్తి తో వాటిపై ఇష్టం పెంచుకోకుండా అందరికీ ఆమడ దూరం ఉంటుంది. ఎన్ఆర్ఐ ని పెళ్లి చేసుకున్న ఆర్తి అగర్వాల్ ఎక్కువగా లావు పెరగడం తో లైపోసెక్షన్ సర్జరీ చేయించుకుని అది వికటించడంతో 31 ఏళ్లకే చనిపోయింది. ఈ విధంగా అక్క సూచనలతో సినీ పరిశ్రమలో అరంగేట్రం చేసి కెరీర్ని నాశనం చేసుకుంది అదితి అగర్వాల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: