టాలీవుడ్లో ఇటివలే త్రివిక్రమ్, బన్నీ ల కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠ పురంలో' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు థమన్. ఈ సినిమాలోని దాదాపు అన్ని పాటలు ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సినిమా వచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇంకా ఈ సినిమా పాటలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.దీంతో ఇప్పుడు థమన్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శక నిర్మాతల దృష్టి ఈ యువ సంగీత దర్శకుడిపై పడింది.ఇక ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కి కూడా అదిరిపోయే పాటలు, నేపధ్య సంగీతాన్ని అందించాడు థమన్.

ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు.ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు ఉండగా.. ఇప్పుడు మ్యూజిక్ విషయంలో కూడా ఫ్యాన్స్ కి ఆసక్తి పెరిగిపోతోంది.ఎందుకంటే ప్రస్తుతం థమన్..బ్యాక్ టూ బ్యాక్ హిట్ ఆల్బమ్స్ ని ఇవ్వడం.. ఇక గతంలో మహేష్, థమన్ కాంబినేషన్ లో వచ్చిన దూకుడు, బిజినెస్ మెన్,ఆగడు సినిమాలు మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ ని సాధించాయి.ఈ నేపథ్యంలో థమన్ తాజాగా మరోసారి మహేష్ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.తాజాగా ఇదే విషయం పై స్పందించాడు థమన్.

అంతేకాదు ఈ సినిమా మ్యూజిక్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఫ్యాన్స్ కి హామీ కూడా ఇచ్చాడు.సర్కారు వారి పాట సినిమాకి సంబంధించి పాటలు కానీ, నేపధ్య సంగీతం కానీ..ఊహించిన దానికంటే ఎక్కువగా హిట్ అవుతుందని చెప్పాడు.ఇక ముందు చెప్పిన విధంగానే కరోనా పరిస్థితులు తగ్గాక.. తాము ఇస్తామన్న అప్డేట్ కూడా త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చాడు.ఇక ఇప్పటికే సినిమాలో మూడు పాటలు ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయని..ఇంకా కేవలం రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని..అంతేకాదు ఇందుకు ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతోందనితెలిపారు.ఇక ఈ అప్డేట్ తో సినిమాపై మరోసారి అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఇక పరశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: