పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇంకా కొత్తవి కూడా ఒప్పుకుంటున్నాడు. అయితే ప్రభాస్ మాట తప్పాడు, ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ఫ్యాన్స్ కి ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకోలేదు.

బాహుబలి మూవీ తో అయిదేళ్ల కాలం గడిపేసిన ప్రభాస్ ఆ తరువాత సాహో రిలీజ్ కి రెండేళ్ళు టైమ్ తీసుకున్నాడు. ఇక దాని తరువాత మొదలుపెట్టిన రాధేశ్యామ్ మూవీ షూటింగ్ ఇప్పటికీ కొంత ఉంది. ఈ మూవీ తరువాత ప్రభాస్ రెండు సినిమాలు సమాంతరంగా కరోనా రెండవ దశ వరకూ షూటింగ్ జరుపుకుంటూ వచ్చాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభాస్ ఇపుడు మళ్లీ సెట్స్ మీదకు రానున్నాడు. రాధేశ్యామ్ అతి తక్కువ షూటింగ్ పార్ట్ ఉండడంతో దాన్ని పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడుట.

ఆ తరువాత ఆయన సలార్, ఆదిపురుష్ షూటింగులలో మొదటి దేనిలో పాల్గొంటారు అన్న దాని మీద చర్చ సాగుతోంది. ప్రభాస్ సలార్ షూటింగ్ లో పాల్గొని తొందరగా అది ఫినిష్ చేయడానికే మొగ్గు చూపిస్తున్నాడుట. మొదటి విడత కరోనా తరువాత ప్రభాస్ ఆది పురుష్ షూటింగ్ ను ముందుకు కదిలించాడు. అయితే ఇపుడు ఆయన డెసిషన్ మారింది అంటున్నారు. రెండవ విడత కరోనాతోనే కంప్లీట్ చేంజ్ అంటున్నాడు అని వినిపిస్తోంది. రాధేశ్యామ్  మూవీ ప్యూర్ లవ్ స్టోరీ. అంటే సాఫ్ట్ గా ఉంటుంది.

దీని తరువాత పక్కా యాక్షన్ కమర్షియల్ మూవీ ఒకటి పడితేనే కెరీర్ సాఫీగా సాగుతుంది అని ప్రభాస్ ఆలోచిస్తున్నాడుట. అందుకే సలార్ మూవీని ముందు కంప్లీట్ చేసి వచ్చే వేసవి కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడుట. ఆ తరువాత ఆది పురుష్ షూటింగ్ పూర్తి చేసి 2023లో రిలీజ్ చేయాలన్నది ఆలోచనట. ఇక ఈ మధ్యలో అన్నింటి కన్నా ముందు ఒప్పుకున్న వైజయంతి మూవీస్ వారి సినిమా ఉంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్  డైరెక్షన్ లో ప్రభాస్ చేయాల్సిన సినిమా షూటింగ్ 2022 చివరలో కానీ మొదలు కాదు అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ తాను వరస సినిమాలు కాదు కానీ నిర్మాతలు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారుట.


మరింత సమాచారం తెలుసుకోండి: