తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ రేంజ్ ఇప్పుడు మాములుగా లేదు. బాహుబలి సినిమాతో వచ్చిన ఫేమ్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు ప్రభాస్ తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా సినిమాలన్నీ కొద్ది పాటి షూటింగ్ పార్ట్ మినహా అన్ని చివరి దశకు వచ్చేశాయి. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్, ఆదిపురుష్ మరియు సలార్ సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉండగానే ఆగిపోయిన విషయం తెలిసిందే. ఒక్క రాధేశ్యామ్ మూవీ షూటింగ్ మాత్రం కేవలం పది రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఈ సినిమాను రాధా కృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఒక చారిత్రాత్మక ప్రేమకథగా రూపుదిద్దుకుంటోంది.

సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రముఖ హాస్య నటుడు ప్రియదర్శి రాధేశ్యామ్ మూవీ గురించి  కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఈ సినిమాలో ప్రియదర్శి ఒక మంచి కమెడియన్ గా చేస్తున్నాడు. ఈ సినిమాలో అన్న పక్కన నటించడం గొప్ప అనుభూతిని మిగిల్చిందని తెలపడం విశేషం. ఇందులో ప్రియదర్శికి ప్రభాస్ కి మధ్యన వచ్చే సన్నివేశాలు బాగా కామెడీగా బాగా వర్క్ అవుట్ అవుతాయని పేర్కొన్నాడు. అంతే కాకుండా ఈ సినిమాలో ప్రియదర్శి పూజా హెగ్డే ను ఇంప్రెస్ చేయడానికి పడే పాట్లు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది.


ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీలో ప్రియదర్శి కూడా ఒక పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియదర్శి కెరీర్ ఇప్పుడు బాగానే ఉంది. ఈ మధ్యనే వచ్చిన జాతి రత్నాలు మూవీ ప్రియదర్షికి మంచి పేరును తీసుకువచ్చింది. దీనితో ఆఫర్ లు ఫుల్ గా వస్తున్నాయి. త్వరలోనే కరోనా అంతరించిపోయి మిగిలిన కాస్త రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.



 


మరింత సమాచారం తెలుసుకోండి: