ఇటీవల కాలంలో సహజీవనం అనేది చాలావరకు కామన్ అయిపోయింది. ఒకప్పుడు మాదిరిగా కాకుండా పెళ్ళికి ముందే జంటలు కొన్నాళ్లపాటు కలిసి ఉండడం, ఆ సమయంలో ఒకరి ఇష్ఠాలను మరొకరు తెలుసుకోవడం, ఆపై కొన్నాళ్ల అనంతరం వివాహం చేసుకోవడం ఇటీవల చూస్తున్నాం. ఇక పలువురు సెలెబ్రిటీలు కూడా ఈ తరహా పద్దతికి మొగ్గుచూపుతున్నారు. అలానే గతంలో కొన్ని సెలబ్రిటీ జంటలు ఈ విధానాన్ని అనుసరించి ఆపై వివాహాలు కూడా చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడానికి కారణం ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న యువ భామ జాక్వలీన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం ఒక ప్రముఖ వ్యక్తితో సహజీవనం చేస్తోందని బాలీవుడ్ వర్గాల టాక్. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో మూవీ లోని బ్యాడ్ బాయ్ సాంగ్ లో తన అందాలతో అదరగొట్టిన జాక్వలీన్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తీస్తున్న పీరియాడికల్ డ్రామా మూవీ హరిహర వీరమల్లు లో కూడా యాక్ట్ చేస్తోంది.

అసలు విషయం ఏమిటంటే జాక్వలీన్, ఇటీవల ముంబైలోని జుహు ప్రాంతంలో ఒక ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిందని, అనంతరం అందులో సౌత్ కి చెందిన ఒక యువ వ్యాపారవేత్తతో కలిసి ఆమె సహజీవనం చేస్తోందని సమాచారం. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారని, ఇద్దరి అభిరుచులు, ఇష్టాలు కలవడంతోనే వారు ఈ రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నారని, అయితే వీరిద్దరూ ఆ తరువాత పెళ్లి చేసుకుంటారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉందని అంటున్నారు. కాగా ప్రస్తుతం ఈ మ్యాటర్ పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. మరి ఈ విషయమై ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై స్వయంగా జాక్వలీన్ స్పందించాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: