అక్కినేని నాగార్జున సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించారు. ఇక అమల గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పట్లో సినిమాలలో నటించి ప్రేక్షకాదరణ పొందిన ఈమె ఆ తర్వాత అక్కినేని నాగార్జునను వివాహం చేసుకోవడంతో ఈమె పాపులారిటీ మరింత పెరిగింది..వీరికి ఇద్దరు కుమారులు. వీరిద్దరు కూడా సినిమాల్లో బాగానే రాణిస్తున్నారు. అయితే అమల సినిమాల్లోకి రాకముందు ఏం చేస్తుండేది అనే విషయాలు చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు ఆమె గురించి తెలుసుకుందాం..
నాగార్జున , అమల వివాహం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తను పరభాష అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి. ఈ వివాహాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.. నిజానికి అమల నాగార్జునకు రెండవ భార్య. అంతకుముందే విక్టరీ వెంకటేష్ సోదరితో వివాహం అయింది  కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. ఇక అప్పటికే వారికి నాగ చైతన్య కూడా పుట్టాడు. నాగార్జున , అమల కి పుట్టిన కుమారుడు అఖిల్.
నాగార్జున నటించిన కిరాయి దాదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది అమల. నిజానికీ సినిమాల్లోకి రావడం తనకు ఇష్టం లేదట. కానీ అమలకి నాట్యం అంటే చాలా ఇష్టం.. ఆ ఇష్టంతోనే పలు దేశాలలో నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది.  ఈమె 10+2 చదువుతున్న రోజుల్లో నాటక ప్రదర్శన చేస్తున్నప్పుడు టీ. రాజేంద్ర ప్రసాద్ ఆమె నాట్యం చూసి సినిమాలో ఆఫర్ ఇచ్చాడట. మొదట అమల సినిమాలో చేయడానికి ఒప్పుకోలేదు. తన చదువు మొత్తం అయిపోయాక సినిమాల్లో నటిస్తానని తేల్చిచెప్పింది. కానీ ప్రసాద్ మాత్రం ఎగ్జామ్స్ అయిపోయాక షూటింగ్ మొదలు పెడదామని చెప్పడంతో.. ఆమె ఒప్పుకొంది.
అమల నటించిన మొదటి సినిమా "మైథిలి ఎం కాదలి" ఈ సినిమా భారీ హిట్ అవడంతో ఆమెకు వరుస ఆఫర్లు వెళ్ళువలా వచ్చాయి. ఇక తెలుగులో కమల్ హాసన్ సరసన పుష్పక విమానం లో నటించింది. ఈ సినిమా అమలాకు స్టార్డం తెచ్చిపెట్టింది. నాగార్జున, అమల కలిసి నటించిన శివ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో.. ఆ సినిమా నుంచి వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: