నటి ప్రియమణి పెళ్లికి ముందు ఇండస్ట్రీకి కొంత విరామం తీసుకోని మళ్ళి సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇప్పుడు తన సినీ జీవితం కోసం చక్కగా ప్లాన్ చేసుకుంటుంది ఈ భామ. ప్రియమణి పెళ్ళైన తర్వాత కొంతకాలం సినిమాలను తగ్గించిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఓ పక్క బుల్లితెర పై అలరిస్తూనే మరో పక్క కథా బలం ఉన్న సినిమాల్లో ప్రాముఖ్యత కలిగిన పాత్రలలో నటిస్తుంది. ఇక రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘విరాట పర్వం’ సినిమాలో ఈమె భారతక్క అనే నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ‘నారప్ప’ సినిమాలో వెంకటేష్ సరసన మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇక ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇదిలా ఉండగానే.. ఇటీవల విడుదలైన ‘ఫ్యామిలీ మెన్2’ వెబ్ సిరీస్ ద్వారా దేశం మొత్తం పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. ఈ తరుణంలో ఆమె ఫోర్జరీకి కూడా పాల్పడినట్టు తెలిపి అందరికి షాకిచ్చింది.

అయితే ప్రియమణి మాట్లాడుతూ.. “మా నేటివ్ ప్లేస్ కేరళ అయినప్పటికీ నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే అని అన్నారు. ఆమె ఏ క్లాసో గుర్తు లేదు కానీ ఓసారి నా ప్రోగ్రెస్‌ రిపోర్ట్ లో మా అమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేశానని అన్నారు. అయితే అది తెలిసి మా అమ్మకు నా పై కోపం వచ్చింది. ఇక మళ్ళీ అది రిపీట్ చేయను అని అమాయకంగా చెప్పేసరికి నవ్వేసిందంట.

అంతేకాదు.. ఆమె రేపు పరీక్షలనగా నా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ రికార్డులను ముందేసుకుని కూర్చునేదాన్ని అని అన్నారు. ఇక అది చూసి నాన్న, అన్నయ్య రాత్రంతా నాతో పాటు కూర్చుని వాటన్నింటినీ పూర్తి చేసేవారని చెప్పుకొచ్చింది. అయితే ఇంట్లో నేను చిన్నదాన్ని కాబట్టి నేను ఎంత అల్లరి చేసినా వాళ్లకు కోపం వచ్చేది కాదని అన్నారు. ఇక ఇంటికెవరైనా వస్తే వాళ్ళ దగ్గర కూడా అమ్మానాన్న ఇవన్నీ చెప్పి నవ్వుకునేవారని తెలిపింది. ఇక ఇప్పుడు అవ్వని తలుచుకుంటే ఇప్పటికీ నాకు నవ్వు వస్తూనే ఉంది” అంటూ ప్రియమణి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: