ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి ఈ పవర్ ఫుల్ కాంబోలో రానున్న చిత్రం అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు మెగా ఫాన్స్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘దిల్‌’ రాజు నిర్మించనున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంపార్టెంట్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉండనుందని ఆ పాత్ర కోసం పలువురిని పరిశీలించి ఒకరిని ఫైనల్ చేసినట్లుగా సమాచారం. కాగా ఆ పాత్ర కోసం మొదట వైవిధ్యభరిత నటుడు విజయ్ సేతుపతి పేరు వినిపించగా, ఇప్పుడు ఆ ప్లేస్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పేరు వినిపిస్తోంది.

దాదాపుగా విలక్షణ నటుడు మోహన్ లాల్ ఫైనల్ అయినట్లు చెబుతున్నారు. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ప్రతిష్టాత్మక దర్శకుడు శంకర్ ఇప్పటివరకు తమిళ్ లో తీసిన సినిమాలనే తెలుగులో కూడా డబ్ చేసి ఇక్కడ ఫుల్ క్రేజ్ పెంచుకున్నారు. పేరుకు తమిళ దర్శకుడు అయినా తెలుగు ప్రేక్షకులు శంకర్ సినిమా అంటే చాలు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే మొట్టమొదటిసారిగా డైరెక్టర్ శంకర్ తెలుగులో నేరుగా సినిమా తీస్తుండడం విశేషం. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే శంకర్ ఇండియన్ 2 మూవీ నిర్మాతలతో వివాదంలో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుంది అన్న విషయం క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో కూడా అలియాభట్ నే హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న "ఆర్ఆర్ఆర్" చిత్రంలో బిజీగా ఉండగా, ఈ సినిమా అనంతరం శంకర్ ప్రాజెక్టు కు రెడీ కానున్నారు. మరి ఇదంతా ప్రణాళిక ప్రకారం జరగాలంటే ముందు కరోనా వైరస్ గండం తొలగిపోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: