బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం 'అఖండ'.మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సింహా,లెజెండ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు రావడంతో.. తాజాగా తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై ఇప్పటికే భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బోయపాటి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ రోర్ నిరూపించింది. సోషల్ మీడియాలో అఖండ టైటిల్ రోర్ భారీ రెస్పాన్స్ ని అందుకొని..సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది.

ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఇదిలా వుండగా ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.బోయపాటి ఎప్పటిలానే రొటీన్ కథతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా..ఈ సారి మాత్రం కాస్త డిఫరెంట్ ఎలివేషన్స్ ని సినిమా కోసం క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.అయితే బోయపాటి మాత్రం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట.ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అసలు కథ విషయానికి వస్తే..సినిమాలో హీరో విలన్ బ్రదర్ ని చంపడం నుండి కథ మొదలవుతుంది.

 ఆ తర్వాత హీరో అజ్ఞాతం నుంచి బయటకి రావడం అసలు ట్విస్ట్ అని తెలుస్తోంది.ఇక సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నారు.అయితే సినిమా కథ రొటీన్ అయినప్పటికీ..బోయపాటి ట్రీట్మెంట్ మాత్రం కచాలా కొత్తగా ఉంటుందట.సినిమాలో చాలా వరకు బోయపాటి గతంలో చూడని విధంగా కొన్ని ఎపిసోడ్స్ ని డిజైన్ చేసాడట.ముఖ్యంగా అఘోర పాత్రలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండనుందని..దాదాపు 20 నిమిషాల నిడివితో ఆ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉండబోతోందని..అంతేకాదు ఆ ఎపిసోడ్ కోసం భారీగా కూడా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఇక సినిమా మొత్తానికే ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలవనుందని అంటున్నారు..మరి రేపు సినిమా విడుదల తర్వాత 'అఖండ' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: