'కేజీఎఫ్' అనే సినిమా రాకపోయుంటే కన్నడ హీరో యశ్ దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందేవాడు కాదేమో. కేవలం కన్నడ ఇండ్రస్టీ లో ఓ సాదా సీదా హీరోల మిగిలిపోయేవాడు. చెప్పడానికి కొంచం అతిగా ఉన్న ఈ విషయాన్ని అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే 'కేజీఎఫ్' సినిమా దేశవ్యాప్తంగా ఒక ప్రభంజనం సృష్టించింది.కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కన్నడతో పాటుగా అని భాషల్లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతో హీరో యశ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అంతేకాదు మరో వైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఫుల్ పాపులారిటీ ని తెచ్చుకొని.. ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుస పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు.

ఇక కేజీఎఫ్ సినిమాకి కొనసాగింపుగా పార్ట్2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. జులై నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నా.. కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ వాయిదా పడింది.ఇక ఈ సినిమా తర్వాత యశ్..దర్శకుడు నార్తన్ తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కడం విశేషం.ఇక ఈ సినిమాలో హీరో యశ్ ఒక నేవీ ఆఫీసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది.సినిమాలో యశ్ ని ఓసరికొత్త లుక్ లో చాలా స్టైలిష్ గా చూపించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.హోంబలే ఫిలిమ్స్ తో జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఇక యశ్ సరసన టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించనుంది.ఇక తమన్నాను హీరోయిన్ గా తీసుకుంటే తెలుగు తో పాటుగా హిందీలో కూడా సినిమాకి మంచి మార్కెట్ లభిస్తుందని..ఆ కారణం చేతనే తమన్నాను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ రానుందట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: