మెగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ పై అందరిలోను ఎంతో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాల గొప్ప సక్సెస్ లతో దర్శకుడిగా పేరు దక్కించుకున్న రాజమౌళి ప్రస్తుతం తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీని అంతకు మించేలా మరింత అద్భుతంగా తీస్తున్నట్లు టాక్. రామ్ చరణ్ అల్లూరిసీతారామ రాజు గా కనిపంచనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా కేకే సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
అత్యంత భారీ వ్యయంతో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ చిత్ర రంగాలకు చెందిన పలువురు నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇటీవల విడువులైన ఎన్టీఆర్, చరణ్ ల పాత్రల ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుని సినిమాపై మరింతగా అంచానలు పెంచాయి. వాస్తవానికి ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేయాలని మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. అయితే అనుకోకుండా ఇటీవల కొరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోవడంతో ఆర్ఆర్ఆర్ కూడా నిలిచిపోయింది, దానితో మూవీ కి సంబంధించి చాలావరకు వర్క్ పెండింగ్ ఉందని, మరోవైపు విజువల్ ఎఫెక్ట్ ఇటీవల ప్రారంభం అయినప్పటికీ అది పూర్తి అవ్వడానికి కూడా మరికొంత సమయం పట్టనుందని సమాచారం.
అలానే త్వరలో థియేటర్స్ తెరుచుకుని సినిమాల విడుదల ప్రారంభం అయినప్పటికీ పూర్తి స్థాయిలో 100 శాతం ఆక్యుపెన్సీ లభించే అవకాశం ఇప్పట్లో కనపడడం లేదని, కాగా ఇటువంటి పరిస్థితుల్లో ఇంతటి భారీ సినిమాతో రిస్క్ చేయడం ఇష్టం లేని మేకర్స్ ఆర్ఆర్ఆర్ మూవీని ఏకంగా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరోవైపు ఈ సినిమా సమ్మర్ కి వస్తుంది అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో అదే కనుక జరిగితే, గోవిందా గోవిందా మరికొన్ని నెలల పాటు ప్రేక్షకులు ఈ భారీ మూవీ కోసం వెయిట్ చేయకతప్పదని అంటున్నాయి సినీ వర్గాలు .... !!


మరింత సమాచారం తెలుసుకోండి: